15 నిమిషాల్లో దుబాయ్‌ నుంచి అబుదాబీకి

- October 13, 2015 , by Maagulf
15 నిమిషాల్లో దుబాయ్‌ నుంచి అబుదాబీకి

ఊహలకే అందని ఆశ్చర్యకరమైన విషయం ఇది. కానీ ఇది వాస్తవ రూపం దాల్చడం అసాధ్యం కాబోదని ఎక్స్‌ ప్రైజ్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ మాటల్లో చూస్తే, హైపర్‌లూప్‌ పాసింజర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ని తొలిసారిగా వినియోగించుకునే దేశంగా యూఏఈ అవతరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. స్పేస్‌ ఎక్స్‌ ఎలాన్‌ మస్క్‌ ఇంజనీర్‌ మాట్లాడుతూ, 1200 మైల్స్‌ పెర్‌ అవర్‌ వేగంతో హైపర్‌ లూప్‌ ప్రయాణీకులకు అందుబాటులోకి వస్తుందనీ, అన్నీ సహకరిస్తే 2020 నాటికే ఈ ప్రాజెక్ట్‌ని పూర్తి చేయవచ్చని అన్నారు. దుబాయ్‌లో పర్యటిస్తున్న పీటర్‌ డైమాండిస్‌ చెబుతూ, జపాన్‌కి చెందిన మాగ్లెవ్‌ బుల్లెట్‌ ట్రైన్‌కి రెండింతల వేగంతో ఈ ప్రాజెక్ట్‌ పట్టాలపై దూసుకుపోతుందన్నారు. మాగ్లెవ్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ 318 బిలియన్‌ డాలర్ల ఖర్చుతో రూపొందింది. టోక్యో మరియు ఒసాకాల మధ్య కేవలం ఒక గంట ప్రయాణ సమయంలోనే ఈ రైలు దూసుకుపోతుంది. అయితే ఎలాన్‌ మస్క్‌ మాగ్లెవ్‌ ప్రాజెక్ట్‌ల కన్నా తక్కువ ఖర్చుతోనే హైపర్‌లూప్‌ ప్రాజెక్ట్‌ పూర్తి చేయవచ్చని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే అబుదాబీ నుంచి దుబాయ్‌కి కేవలం 15 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com