15 నిమిషాల్లో దుబాయ్ నుంచి అబుదాబీకి
- October 13, 2015
ఊహలకే అందని ఆశ్చర్యకరమైన విషయం ఇది. కానీ ఇది వాస్తవ రూపం దాల్చడం అసాధ్యం కాబోదని ఎక్స్ ప్రైజ్ ఫౌండేషన్ ఛైర్మన్ మాటల్లో చూస్తే, హైపర్లూప్ పాసింజర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని తొలిసారిగా వినియోగించుకునే దేశంగా యూఏఈ అవతరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. స్పేస్ ఎక్స్ ఎలాన్ మస్క్ ఇంజనీర్ మాట్లాడుతూ, 1200 మైల్స్ పెర్ అవర్ వేగంతో హైపర్ లూప్ ప్రయాణీకులకు అందుబాటులోకి వస్తుందనీ, అన్నీ సహకరిస్తే 2020 నాటికే ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయవచ్చని అన్నారు. దుబాయ్లో పర్యటిస్తున్న పీటర్ డైమాండిస్ చెబుతూ, జపాన్కి చెందిన మాగ్లెవ్ బుల్లెట్ ట్రైన్కి రెండింతల వేగంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలపై దూసుకుపోతుందన్నారు. మాగ్లెవ్ ట్రైన్ ప్రాజెక్ట్ 318 బిలియన్ డాలర్ల ఖర్చుతో రూపొందింది. టోక్యో మరియు ఒసాకాల మధ్య కేవలం ఒక గంట ప్రయాణ సమయంలోనే ఈ రైలు దూసుకుపోతుంది. అయితే ఎలాన్ మస్క్ మాగ్లెవ్ ప్రాజెక్ట్ల కన్నా తక్కువ ఖర్చుతోనే హైపర్లూప్ ప్రాజెక్ట్ పూర్తి చేయవచ్చని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే అబుదాబీ నుంచి దుబాయ్కి కేవలం 15 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







