అల్లర్ల కేసులో నేరస్థులకు జైలుశిక్షలను తగ్గించిన కోర్టు
- June 22, 2017
మనామా: అల్లర్లను అదుపు చేయడానికి వచ్చిన ఓ పోలీసు అధికారిపై దాడి చేసి గాయపర్చిన ముగ్గురు వ్యక్తులకు అప్పీల్ ను బుధవారం సుప్రీం కోర్టు తిరస్కరించింది, కానీ నిందితులకు జైలు నిబంధనలను సవరించి ఏడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల వరకు తగ్గించింది. ఈ ముగ్గురు బిల్డ్ ఆల్ ఖదీమ్ గ్రామంలో వెల్లువెత్తిన అల్లర్లలో 40 మంది సబాటర్స్ ఉన్నారు. ఫైర్ బాంబులతో సన్నివేశంలోకి వచ్చిన పోలీసు అధికారులపై దాడి చేసి, ఇనుప రాడ్లతో చితకబాదారు, అనంతరం చెల్లాచెదురుగా పారిపోయారు. అంతేకాక నిందితులు రోడ్లపై పెద్ద పెద్ద బండరాళ్లను మరియు భారీ దుంగలను అడ్డంగా పర్చి ఆ మార్గంపై ప్రయాణించకుండా చేశారు. గాయపడిన పోలీసును అతని సహచరులు అక్కడ నుంచి వెళ్లేందుకు ఎంతో శ్రమించి అడ్డంకులన్నింటిని తొలగించి ఎట్టకేలకు ఆసుపత్రికి తరలించారు. శిక్ష పడిన అపరాధులలో ఒకరు ఆ పోలీస్ తలపై ఒక ఇనుప కడ్డితో బలంగా మోదాడు. అక్కడ వైద్యులు పరీక్షలు జరిపి ఒక ప్రేగును కత్తిరించినట్లు వెల్లడించారు, ఎందుకంటే అల్లర్లు జరిగిన సమయంలో ఓ నిందితుడు సూదిగా ఉన్న ఓ ఇనుప రాడ్ ను పోలీస్ అధికారి కడుపు లోనికి దించివేశాడు. ఈ కేసులో డిటెక్టీవ్ లు త్వరితగతిన దర్యాప్తులు ప్రారంభించి, అల్లర్లకు పాల్పడిన 12 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులను ఇంతకుముందు దోషులుగా నిర్ధారించారు. వారందరికీ ఏడు సంవత్సరాల జైలుశిక్షను కోర్టు విధించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ
- యాంటి పేపర్ లీక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
- ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన కువైట్..
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి







