సబ్సిడీ ఎత్తివేతతో బహ్రెయినీలకు లబ్ది
- October 13, 2015
80 శాతం మీట్ సబ్సిడీ పొందుతున్నవారిలో వలసవాదులు, కంపెనీలు మరియు రెస్టారెంట్లు మాత్రమేనని షౌరా కౌన్సిల్ ఎఫైర్స్ మినిస్టర్ ఇసా అల్ హమ్మాది ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. ప్రభుత్వ అధికార ప్రతినిథి కూడా అయిన అల్ హమ్మాదీ, బహ్రెయినీలకు సబ్సిడీ కొనసాగుతుందనీ, అయితే సబ్సిడీ సొమ్ము బహ్రెయినీల ఖాతాలోకి డైరెక్ట్గా వెళుతుందని అన్నారు. 130,000 మంది బహ్రెయినీలు మీట్ సబ్సిడీల కోసం దరఖాస్తు చేసుకున్నారనీ, మీట్ సబ్సిడీ ఎత్తివేసినప్పటినుంచీ వారి ఖాతాల్లోకి నేరుగా సబ్సిడీ మొత్తం చెల్లించబడుతుందని వివరించారు. బహ్రెయినీలకు నష్టం లేకపోవడంతో మీట్ సబ్సిడీ ఎత్తివేసే ఆలోచనే లేదనీ, దేశ ప్రజలకు ఇస్తున్న సబ్సిడీ, కమర్షియల్ కోణంలో పక్కదారి పడుతుండడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు అల్ హమ్మాది. అయితే మార్కెట్లో అమ్మకాలు తగ్గిపోవడంతో మీట్ వ్యాపారులు ఆందోళన బాట పట్టారు. చాలా రెస్టారెంట్లు మీట్ ఉత్పత్తుల్ని మెనూలోంచి తీసేశాయి మీట్పై సబ్సిడీ ఎత్తివేసిన తర్వాత.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







