నాల్గో వన్డే : ఇండియా పై విండీస్ గెలుపు
- July 02, 2017
విండీస్ టూర్ లో టీమిండియాకు తొలి పరాభవం ఎదురైంది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా నార్త్ సౌండ్లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో ఆతిథ్య విండీస్ 11 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఎవిన్ లెవిస్ 35, కైల్ హోప్ 35, షాయ్ హోప్ 25, రోస్టన్ చేజ్ 24, జాసన్ మహ్మద్ 20 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, హార్ధిక్ పాండ్యా చెరో 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసుకున్నాడు.
అనంతరం 190పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్.. విండీస్ బౌలర్ల దెబ్బకు 49.4 ఓవర్లలోనే 178 పరుగులకు ఆలౌటయ్యారు. రహానే (60), మహేంద్ర సింగ్ ధోనీ (54), హార్ధిక్ పాండ్యా (20) మినహా మరెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. విండీస్ కెప్టెన్ హోల్డర్ 5 పరుగులు పడగొట్టడం విశేషం. ఈ గెలుపుతో విండీస్ 1-2తో భారత్ ఆధిక్యాన్ని తగ్గించింది. సిరీస్ ఫలితం 6 వ తేదీన జరగనున్న చివరి వన్డేకు మారింది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









