మచ్చర్ జల్ సొర్సె పాబ్డా
- July 10, 2017
కావాల్సిన పదార్థాలు:
పాబ్డా చేప - 180గ్రాములు, ఉల్లిపాయని ఉడికించిన గుజ్జు - 50గ్రాములు, టొమాటో గుజ్జు - 50గ్రాములు, పచ్చిమిర్చి - మూడు, అల్లం వెల్లుల్లి గుజ్జు - 15గ్రాములు, జీలకర్ర - ఐదు గ్రాములు, ధనియాల ముద్ద - ఐదు గ్రాములు, ఎండుమిర్చి - మూడు, పసుపు రంగు ఆవాల గుజ్జు, నలుపు ఆవాల గుజ్జు - ఒక్కోటి పది గ్రాముల చొప్పున, కొత్తిమీర - అలంకరణకు, వేగించిన జీలకర్ర పొడి - ఐదు గ్రాములు, పసుపు - మూడు గ్రాములు, ఉప్పు - రుచికి తగినంత, ఆవ నూనె - తగినంత, పంచదార - మూడు గ్రాములు, పచ్చి మిర్చి గుజ్జు - మూడు గ్రాములు, నల్లజీలకర్ర - రెండు గ్రాములు, పచ్చిమిర్చి గుజ్జు - మూడు గ్రాములు.
తయారీ విధానం:
చేపను శుభ్రంగా కడిగి రెండు వైపులా ఉప్పు, పసుపు వేసి నానబెట్టాలి.
తరువాత ముక్క మునిగే నూనె పోసి అందులో నానబెట్టిన ముక్కల్ని వేగించాలి.
ఒక పాత్రలో నూనె వేడి చేసి నల్ల జీలకర్ర వేయాలి. అవి చిటపట అంటున్నప్పుడు ఉల్లిపాయ, టొమాటో, అల్లంవెల్లుల్లి, జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిర్చిల గుజ్జు వేయాలి. పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి కొద్దిసేపు వేగించాలి.
ఠ ఆ తరువాత ఆవగుజ్జు వేసి పావు గంట ఉడికించాక చేప వేయాలి. దానిపైన వేగించిన జీలకర్రపొడి, కొత్తిమీర తరుగు వేసి అలంకరించాలి. దీన్ని కూడా అంతే హాట్ హాట్గా తింటే యమ్మీ యమ్మీగా ఉంటుంది.
తాజా వార్తలు
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన









