మచ్చర్ జల్ సొర్సె పాబ్డా
- July 10, 2017కావాల్సిన పదార్థాలు:
పాబ్డా చేప - 180గ్రాములు, ఉల్లిపాయని ఉడికించిన గుజ్జు - 50గ్రాములు, టొమాటో గుజ్జు - 50గ్రాములు, పచ్చిమిర్చి - మూడు, అల్లం వెల్లుల్లి గుజ్జు - 15గ్రాములు, జీలకర్ర - ఐదు గ్రాములు, ధనియాల ముద్ద - ఐదు గ్రాములు, ఎండుమిర్చి - మూడు, పసుపు రంగు ఆవాల గుజ్జు, నలుపు ఆవాల గుజ్జు - ఒక్కోటి పది గ్రాముల చొప్పున, కొత్తిమీర - అలంకరణకు, వేగించిన జీలకర్ర పొడి - ఐదు గ్రాములు, పసుపు - మూడు గ్రాములు, ఉప్పు - రుచికి తగినంత, ఆవ నూనె - తగినంత, పంచదార - మూడు గ్రాములు, పచ్చి మిర్చి గుజ్జు - మూడు గ్రాములు, నల్లజీలకర్ర - రెండు గ్రాములు, పచ్చిమిర్చి గుజ్జు - మూడు గ్రాములు.
తయారీ విధానం:
చేపను శుభ్రంగా కడిగి రెండు వైపులా ఉప్పు, పసుపు వేసి నానబెట్టాలి.
తరువాత ముక్క మునిగే నూనె పోసి అందులో నానబెట్టిన ముక్కల్ని వేగించాలి.
ఒక పాత్రలో నూనె వేడి చేసి నల్ల జీలకర్ర వేయాలి. అవి చిటపట అంటున్నప్పుడు ఉల్లిపాయ, టొమాటో, అల్లంవెల్లుల్లి, జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిర్చిల గుజ్జు వేయాలి. పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి కొద్దిసేపు వేగించాలి.
ఠ ఆ తరువాత ఆవగుజ్జు వేసి పావు గంట ఉడికించాక చేప వేయాలి. దానిపైన వేగించిన జీలకర్రపొడి, కొత్తిమీర తరుగు వేసి అలంకరించాలి. దీన్ని కూడా అంతే హాట్ హాట్గా తింటే యమ్మీ యమ్మీగా ఉంటుంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..