కార్గో సేవలను అందించేందుకు కంపెనీలను ఆహ్వానిస్తున్న రైల్వే అథారిటీ

- July 13, 2017 , by Maagulf
కార్గో సేవలను అందించేందుకు కంపెనీలను ఆహ్వానిస్తున్న రైల్వే అథారిటీ

ఉత్తర సరిహద్దు మార్గంలో రియాద్, డమ్మామ్ ల మధ్య ప్రయాణికుల సరకు రవాణా సేవలను అందించేందుకు దీర్ఘకాలిక వ్యూహాత్మక పొత్తులుగా వ్యవహరించేందుకు పలు స్థానిక ప్రైవేటు రంగ పెట్టుబడులు అంతర్జాతీయ  రైలు సర్వీసు కంపెనీలను రైల్వే అథారిటీ  ఆహ్వానిస్తూ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ (పిటిఎ)  స్థానిక మీడియా సంస్థలకు నివేదించింది .సౌదీ రైల్వేస్ కో (ఎస్ఏఆర్), సౌదీ రైల్వేస్ ఆర్గనైజేషన్ (ఎస్ ఆర్  ఓ) రాజధానిలో రైల్వే నెట్వర్క ను  నిర్మించి ప్రైవేటు రంగం పాత్రను అభివృద్ధి చేయడానికి మరియు బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నాయి.రైల్వే శాఖ అభివృద్ధికి సంబంధించి అత్యంత ముఖ్యమైన విజన్ 2030 కార్యక్రమాల్లో భాగమైన ఒకటిగా పిటీఏ పిలుపు నిచ్చినట్లు పిటీఏ అధిపతి అయిన ట్రాన్స్పోర్ట్ మంత్రి సులైమాన్ అల్ హమ్దాన్ చెప్పారు. రైల్వే ప్రాజెక్టులను అమలు చేయడంలో ప్రైవేటు రంగం పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యాల కోసం యంత్రాంగం నెలకొల్పడానికి నేషనల్ సెంటర్ ఫర్ ప్రైస్వాటీస్ (ఎన్సీపీ) తో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ (పిటిఎ) సమన్వయం కల్పించిందని ఆయన చెప్పారు. కొన్ని ప్రధాన రంగాలు ప్రైవేటీకరించబడి మరియు సమన్వయ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను అందిస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com