శరణితో రవితేజ వివాహం
- October 20, 2015
తెలుగు చిత్ర పరిశ్రమతో సుదీర్ఘకాలంగా విస్తృతమైన సంబంధ బాంధవ్యాలు కలిగిన ప్రముఖ రాజకీయవేత్త-ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి మరియు విద్యాశాఖామాత్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు- ప్రముఖ విద్యావేత్త, నారాయణ విద్యాసంస్థల అధినేత, ఆంధ్రప్రదేశ్ పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖామాత్యులు శ్రీ పొంగూరు నారాయణ వియ్యంకులు కాబోతున్నారు. శ్రీ గంటా శ్రీనివాసరావు-శ్రీమతి గంటా శారదల ఏకైక కుమారుడు చి॥రవితేజ వివాహం.. శ్రీ పొంగూరు నారాయణ దంపతుల కనిష్ట పుత్రిక చి॥ ల॥సౌ॥ శరణితో ఈనెల 30న నెల్లూరులో అంగరంగ వైభవంగా జరగనుంది. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీమన్మధనామ సంవత్సర ఆశ్వీయుజ బహుళ తదియ తత్కాల చవితి శుక్రవారం అనగా.. తేది 30-10-2015 రాత్రి గం॥ 10.25 ని॥లకు.. మృగశిర నక్షత్రయుక్త మిధున లగ్న శుభపుష్కరాంశ సుముహూర్తాన 'రవితేజ-శరణి'ల వివాహం జరిపించుటకు దైవజ్ఞులు నిర్ణయించినారు. నెల్లూరులోని "నారాయణ మెడికల్ కాలేజి క్యాంపస్" ఈ వివాహ మహోత్సవానికి వేదిక కానుంది. ఆరోజు రాత్రి 7 గం॥ల నుంచి విందు మొదలు కానుంది. నాలుగు రోజుల అనంతరం.. అనగా 4-11-2015 సాయంత్రం 7 గం॥ల నుంచి విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్శిటి ఇంజినీరింగ్ కాలేజి గ్రౌండ్స్లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. బంధుమిత్ర సపరివార సమేతంగా అందరూ విచ్చేసి.. నూతన వధూవరులను ఆశీర్వదించి.. తమ ఆతిధ్యం స్వీకరించి.. తమను ఆనందింపజేయవసిందిగా గంటా శ్రీనివాసరావు మరియు పొంగూరు నారాయణ దంపతులు సవినయంగా ఆహ్వానిస్తున్నారు!!
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









