శరణితో రవితేజ వివాహం
- October 20, 2015
తెలుగు చిత్ర పరిశ్రమతో సుదీర్ఘకాలంగా విస్తృతమైన సంబంధ బాంధవ్యాలు కలిగిన ప్రముఖ రాజకీయవేత్త-ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి మరియు విద్యాశాఖామాత్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు- ప్రముఖ విద్యావేత్త, నారాయణ విద్యాసంస్థల అధినేత, ఆంధ్రప్రదేశ్ పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖామాత్యులు శ్రీ పొంగూరు నారాయణ వియ్యంకులు కాబోతున్నారు. శ్రీ గంటా శ్రీనివాసరావు-శ్రీమతి గంటా శారదల ఏకైక కుమారుడు చి॥రవితేజ వివాహం.. శ్రీ పొంగూరు నారాయణ దంపతుల కనిష్ట పుత్రిక చి॥ ల॥సౌ॥ శరణితో ఈనెల 30న నెల్లూరులో అంగరంగ వైభవంగా జరగనుంది. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీమన్మధనామ సంవత్సర ఆశ్వీయుజ బహుళ తదియ తత్కాల చవితి శుక్రవారం అనగా.. తేది 30-10-2015 రాత్రి గం॥ 10.25 ని॥లకు.. మృగశిర నక్షత్రయుక్త మిధున లగ్న శుభపుష్కరాంశ సుముహూర్తాన 'రవితేజ-శరణి'ల వివాహం జరిపించుటకు దైవజ్ఞులు నిర్ణయించినారు. నెల్లూరులోని "నారాయణ మెడికల్ కాలేజి క్యాంపస్" ఈ వివాహ మహోత్సవానికి వేదిక కానుంది. ఆరోజు రాత్రి 7 గం॥ల నుంచి విందు మొదలు కానుంది. నాలుగు రోజుల అనంతరం.. అనగా 4-11-2015 సాయంత్రం 7 గం॥ల నుంచి విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్శిటి ఇంజినీరింగ్ కాలేజి గ్రౌండ్స్లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. బంధుమిత్ర సపరివార సమేతంగా అందరూ విచ్చేసి.. నూతన వధూవరులను ఆశీర్వదించి.. తమ ఆతిధ్యం స్వీకరించి.. తమను ఆనందింపజేయవసిందిగా గంటా శ్రీనివాసరావు మరియు పొంగూరు నారాయణ దంపతులు సవినయంగా ఆహ్వానిస్తున్నారు!!
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







