శరణితో రవితేజ వివాహం
- October 20, 2015
తెలుగు చిత్ర పరిశ్రమతో సుదీర్ఘకాలంగా విస్తృతమైన సంబంధ బాంధవ్యాలు కలిగిన ప్రముఖ రాజకీయవేత్త-ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి మరియు విద్యాశాఖామాత్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు- ప్రముఖ విద్యావేత్త, నారాయణ విద్యాసంస్థల అధినేత, ఆంధ్రప్రదేశ్ పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖామాత్యులు శ్రీ పొంగూరు నారాయణ వియ్యంకులు కాబోతున్నారు. శ్రీ గంటా శ్రీనివాసరావు-శ్రీమతి గంటా శారదల ఏకైక కుమారుడు చి॥రవితేజ వివాహం.. శ్రీ పొంగూరు నారాయణ దంపతుల కనిష్ట పుత్రిక చి॥ ల॥సౌ॥ శరణితో ఈనెల 30న నెల్లూరులో అంగరంగ వైభవంగా జరగనుంది. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీమన్మధనామ సంవత్సర ఆశ్వీయుజ బహుళ తదియ తత్కాల చవితి శుక్రవారం అనగా.. తేది 30-10-2015 రాత్రి గం॥ 10.25 ని॥లకు.. మృగశిర నక్షత్రయుక్త మిధున లగ్న శుభపుష్కరాంశ సుముహూర్తాన 'రవితేజ-శరణి'ల వివాహం జరిపించుటకు దైవజ్ఞులు నిర్ణయించినారు. నెల్లూరులోని "నారాయణ మెడికల్ కాలేజి క్యాంపస్" ఈ వివాహ మహోత్సవానికి వేదిక కానుంది. ఆరోజు రాత్రి 7 గం॥ల నుంచి విందు మొదలు కానుంది. నాలుగు రోజుల అనంతరం.. అనగా 4-11-2015 సాయంత్రం 7 గం॥ల నుంచి విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్శిటి ఇంజినీరింగ్ కాలేజి గ్రౌండ్స్లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. బంధుమిత్ర సపరివార సమేతంగా అందరూ విచ్చేసి.. నూతన వధూవరులను ఆశీర్వదించి.. తమ ఆతిధ్యం స్వీకరించి.. తమను ఆనందింపజేయవసిందిగా గంటా శ్రీనివాసరావు మరియు పొంగూరు నారాయణ దంపతులు సవినయంగా ఆహ్వానిస్తున్నారు!!
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







