జర్మనీలో 1.86 కోట్ల మంది శరణార్థులు ఉన్నట్టు తాజా సర్వే
- August 02, 2017 ఫెడరల్ స్టాటిస్టిక్స్ కార్యాలయం
జర్మనీ జనాభాలో కోటీ 86లక్షల మంది శరణార్థులు ఉన్నట్టు తాజా సర్వేలో వెల్లడయింది. ఫెడరల్ స్టాటిస్టిక్స్ కార్యాలయం (ఎఫ్ఎస్ఓ) తెలిపిన వివరాల ప్రకారం...శరణార్థులకు ఆశ్రయం కల్పించడంలో జర్మనీ అగ్రస్థానంలో ఉన్నది. జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ శరణార్థులకు ఆశ్రయం కల్పించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఓపెన్ డోర్ పాలసీ సత్ఫలితాలను ఇచ్చింది. జర్మనీ ప్రస్తుత జనాభా 8కోట్ల 24లక్షలు. జనాభాలో 1.86కోట్ల మంది శరణార్థులను గుర్తించినట్టు ఎఫ్ఎస్ఓ తెలిపింది. 2015లో జర్మనీకి శరణార్థుల తాకిడి పెరగడంతోనే ఈ సంఖ్య నమోదైందని పేర్కొన్నది. 2014-16 మధ్య కాలంలో ఐరోపాలో ఆశ్రయం కోసం 16లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు ఎఫ్ఎస్ఓ తెలిపింది.23లక్షల మంది మధ్య ప్రాఛ్య దేశాల నుంచి వచ్చినట్టు గుర్తించింది. ఏడు లక్షల మంది ఆఫ్రికా నుంచి వచ్చినట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..