జర్మనీలో 1.86 కోట్ల మంది శరణార్థులు ఉన్నట్టు తాజా సర్వే
- August 02, 2017
ఫెడరల్ స్టాటిస్టిక్స్ కార్యాలయం
జర్మనీ జనాభాలో కోటీ 86లక్షల మంది శరణార్థులు ఉన్నట్టు తాజా సర్వేలో వెల్లడయింది. ఫెడరల్ స్టాటిస్టిక్స్ కార్యాలయం (ఎఫ్ఎస్ఓ) తెలిపిన వివరాల ప్రకారం...శరణార్థులకు ఆశ్రయం కల్పించడంలో జర్మనీ అగ్రస్థానంలో ఉన్నది. జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ శరణార్థులకు ఆశ్రయం కల్పించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఓపెన్ డోర్ పాలసీ సత్ఫలితాలను ఇచ్చింది. జర్మనీ ప్రస్తుత జనాభా 8కోట్ల 24లక్షలు. జనాభాలో 1.86కోట్ల మంది శరణార్థులను గుర్తించినట్టు ఎఫ్ఎస్ఓ తెలిపింది. 2015లో జర్మనీకి శరణార్థుల తాకిడి పెరగడంతోనే ఈ సంఖ్య నమోదైందని పేర్కొన్నది. 2014-16 మధ్య కాలంలో ఐరోపాలో ఆశ్రయం కోసం 16లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు ఎఫ్ఎస్ఓ తెలిపింది.23లక్షల మంది మధ్య ప్రాఛ్య దేశాల నుంచి వచ్చినట్టు గుర్తించింది. ఏడు లక్షల మంది ఆఫ్రికా నుంచి వచ్చినట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్









