జర్మనీలో 1.86 కోట్ల మంది శరణార్థులు ఉన్నట్టు తాజా సర్వే
- August 02, 2017
ఫెడరల్ స్టాటిస్టిక్స్ కార్యాలయం
జర్మనీ జనాభాలో కోటీ 86లక్షల మంది శరణార్థులు ఉన్నట్టు తాజా సర్వేలో వెల్లడయింది. ఫెడరల్ స్టాటిస్టిక్స్ కార్యాలయం (ఎఫ్ఎస్ఓ) తెలిపిన వివరాల ప్రకారం...శరణార్థులకు ఆశ్రయం కల్పించడంలో జర్మనీ అగ్రస్థానంలో ఉన్నది. జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ శరణార్థులకు ఆశ్రయం కల్పించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఓపెన్ డోర్ పాలసీ సత్ఫలితాలను ఇచ్చింది. జర్మనీ ప్రస్తుత జనాభా 8కోట్ల 24లక్షలు. జనాభాలో 1.86కోట్ల మంది శరణార్థులను గుర్తించినట్టు ఎఫ్ఎస్ఓ తెలిపింది. 2015లో జర్మనీకి శరణార్థుల తాకిడి పెరగడంతోనే ఈ సంఖ్య నమోదైందని పేర్కొన్నది. 2014-16 మధ్య కాలంలో ఐరోపాలో ఆశ్రయం కోసం 16లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు ఎఫ్ఎస్ఓ తెలిపింది.23లక్షల మంది మధ్య ప్రాఛ్య దేశాల నుంచి వచ్చినట్టు గుర్తించింది. ఏడు లక్షల మంది ఆఫ్రికా నుంచి వచ్చినట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..









