జర్మనీలో 1.86 కోట్ల మంది శరణార్థులు ఉన్నట్టు తాజా సర్వే
- August 02, 2017
ఫెడరల్ స్టాటిస్టిక్స్ కార్యాలయం
జర్మనీ జనాభాలో కోటీ 86లక్షల మంది శరణార్థులు ఉన్నట్టు తాజా సర్వేలో వెల్లడయింది. ఫెడరల్ స్టాటిస్టిక్స్ కార్యాలయం (ఎఫ్ఎస్ఓ) తెలిపిన వివరాల ప్రకారం...శరణార్థులకు ఆశ్రయం కల్పించడంలో జర్మనీ అగ్రస్థానంలో ఉన్నది. జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ శరణార్థులకు ఆశ్రయం కల్పించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఓపెన్ డోర్ పాలసీ సత్ఫలితాలను ఇచ్చింది. జర్మనీ ప్రస్తుత జనాభా 8కోట్ల 24లక్షలు. జనాభాలో 1.86కోట్ల మంది శరణార్థులను గుర్తించినట్టు ఎఫ్ఎస్ఓ తెలిపింది. 2015లో జర్మనీకి శరణార్థుల తాకిడి పెరగడంతోనే ఈ సంఖ్య నమోదైందని పేర్కొన్నది. 2014-16 మధ్య కాలంలో ఐరోపాలో ఆశ్రయం కోసం 16లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు ఎఫ్ఎస్ఓ తెలిపింది.23లక్షల మంది మధ్య ప్రాఛ్య దేశాల నుంచి వచ్చినట్టు గుర్తించింది. ఏడు లక్షల మంది ఆఫ్రికా నుంచి వచ్చినట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







