ఆలు దోస బజ్జీలు
- August 02, 2017
కావలసినవి: ఆలు 500 గ్రా., దోసకాయలు మీడియం సైజువి 2, మిరియాల పొడి 1/2 టీస్పూను, ఉప్పు తగినంత.
పూతపిండికి: శెనగపిండి 2 క ప్పులు, ఉల్లివిత్తనాలు ఒక టీ స్పూను, నూనె వేగించడానికి సరిపడా, ఉప్పు తగినంత.
తయారుచేసే విధానం
ఆలుగడ్డల్ని చెక్కుతీసి ఫోటోలో చూపిన విధంగా వెడల్పాటి ముక్కలుగా కోసిపెట్టుకోవాలి. ఉప్పు నీళ్ళలో పది నిమిషాలు నానబెట్టి ఉంచాలి. తర్వాత నీళ్ళు ఒడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళు వేడిచేసి దానిలో ఈ ముక్కలువేసి సగం ఉడికీ ఉడక్క ముందే దించేయాలి. మూడు నాలుగు నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉంచొద్దు. మళ్ళీ నీళ్ళన్నీ ఒడకట్టి మిరియాల పొడి చల్లి పక్కన ఉంచేయాలి. దోసకాయల చెక్కుతీసి సన్నగా తురుముకుని చేతులతో ఒత్తి నీళ్ళన్నీ పిండేయాలి.
శెనగపిండి, ఉప్పు, ఉల్లివిత్తనాలను కొంచెం నీళ్ళతో బజ్జీల పిండిలా కలుపుకోవాలి. నురుగు వచ్చేదాకా దాన్ని గిలకొట్టి దోసగుజ్జుని దానిలో బాగా కలిపేయాలి. ఇప్పుడు మూకుడు పెట్టి నూనె వేడిచేయాలి. ఆలుముక్కల్ని ఈ పిండిలో ముంచి మీడియం సెగపెట్టి వేగించాలి. రెండు వేపులా బ్రౌన్రంగు వచ్చేదాకా వేగించి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









