భారత్ లో రేపటి నుంచి చెలామణీలోకి రూ.200నోటు

- August 24, 2017 , by Maagulf
భారత్ లో  రేపటి నుంచి చెలామణీలోకి రూ.200నోటు

శుక్రవారం నుంచి కొత్త రూ.200 నోటు చెలామణీలోకి రానున్నట్లు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. నవంబరు 8 పెద్ద నోట్ల రద్దు తర్వాత విడుదల కానున్న మూడో నోటు ఇది. కొత్తగా విడుదల కానున్న ఈ నోటు పసుపు రంగులో ఉంది. నోటు వెనుక భాగాన భారతదేశ సంప్రదాయ వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా సాంచీ స్తూపం బొమ్మను ముద్రించారు.
పెద్ద నోట్ల అక్రమ నిల్వలు, వాణిజ్యానికి కళ్లెం వేయడమే లక్ష్యంగా రూ.200 నోట్లను తెరపైకి తీసుకొస్తున్నారు. రూ.100, రూ.500 మధ్య మరో కరెన్సీ నోటు ఇప్పటి వరకూ లేదు. దీంతో రూ.200నోటు మంచి ఆదరణ పొందుతుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. పెద్ద నోట్ల తర్వాత ఎదురవుతున్న చిల్లర సమస్యలను కూడా రూ.200 నోటు కారణంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అక్రమ నగదు చెలామణీ.. నకిలీ కరెన్సీ నోట్లకు అడ్డుకట్ట వేసేందుకు రూ.200నోటును ముద్రిస్తున్నట్లు గతంలోనే ఆర్బీఐ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com