బ్లూబెర్రీస్, ఆవకాడో, కోడిగుడ్లు తింటే.. మతిమరుపుకు చెక్
- August 27, 2017
వకాడో, కోడిగుడ్లు, ఆకుకూరలను ఎక్కువగా తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మతిమరుపును దూరం చేసుకోవాలన్నా.. మెదడు పనితీరును మెరుగుపరుచుకోవాలన్నా.. డైట్లో తప్పకుండా ఆకుకూరలను రోజు అరకప్పైనా చేర్చుకోవాలని వారు సూచిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ మెదడు చురుకుదనం తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఆలోచనా శక్తి, తెలివితేటలు కూడా తగ్గిపోతుంటాయి.
మతిమరుపు సమస్యలు ఉత్పన్నం కాకముందే వాటిని జరగకుండా ఉండేలా ల్యూటెన్ సమృద్ధిగా ఉండే ఆకుకూరలు, ఆవకాడో, కోడిగుడ్లు వంటివి ఎక్కువగా తీసుకుంటే మెదడూ శరీరమూ రెండూ చురుగ్గా పనిచేస్తాయని వైద్యులు తెలిపారు. ఈ విషయం ఇప్పటికే పలు పరిశోధనల్లోనూ వెల్లడి అయ్యిందని.. వైద్యులు చెప్తున్నారు. ఆకుకూరల్లోని ల్యూటెన్ జ్ఞాపకశక్తినీ పెంపొందిస్తుందని వారు సూచిస్తున్నారు.
అలాగే బ్లూ బెర్రీస్లో ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. మతిమరుపు కలగకుండా అడ్డుకునే ఫోటోకెమికల్స్ వీటిలో ఉంటాయి. ఆకుకూరలు, ఆవకాడో, కోడిగుడ్లతో పాటు క్యాలీఫ్లవర్, మొలకెత్తిన విత్తనాలు, ఆరెంజ్, ద్రాక్ష పండ్లు తీసుకోవడం మంచిది. మెదడుకు రక్తప్రసరణ సరిగ్గా జరగాలంటే, జ్ఞాపకశక్తి పెరగాలంటే.. తాజా పండ్లు, కాయగూరలు తీసుకోవాలి.
అంతేగాకుండా సాల్మన్ ఫిష్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మెదడును యాక్టివ్గా, ఎనర్జిటిక్గా మార్చడంలో ఉపయోగపడతాయి. మానసిక ఆందోళనను దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







