భారత్లో అమెరికా కొత్త రాయబారి కెన్నత్ జస్టర్
- September 02, 2017
భారత్కు అమెరికా రాయబారిగా కెన్నత్ జస్టర్ పేరును ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. జనవరి 20 నుంచి ఖాళీగా ఉన్న ఈ పదవి భర్తీ కోసం జూన్లోనే వైస్హౌస్ సిఫారసు చేసినా ట్రంప్ ఈ రోజు ప్రకటించారు. సెనెట్ ఆమోదం తర్వాత భారత్కు రాయబారిగా వచ్చే అవకాశం ఉంది.
62 ఏళ్ల కెన్నెత్ ట్రంప్కు కీలక ఆర్థిక సలహాదారుడు, భారత వ్యవహారాల్లో ఆయనకు పట్టు ఉంది. ప్రస్తుతం ఆయన అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో అమెరికా అధ్యక్షుడికి డిప్యూటీ అసిస్టెంట్గా, జాతీయ ఆర్థిక మండలిలో ఉప సంచాలకులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో అమెరికా రాయబారి పదవి ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఖాళీగా ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







