ఉంగరాల రాంబాబు విడుదల తేదీ ఖరారు
- September 05, 2017
సునీల్, మియాజార్జి జంటగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఉంగరాల రాంబాబు'. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకొని ఈనెల 15న ఈ చిత్రం విడుదలకానుంది. యునైటెడ్ కిరీటి మూవీస్ లిమిటెడ్ బ్యానర్పై పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి తెరకెక్కించిన ఈ చిత్రం సునీల్ నటించిన గత చిత్రాలకంటే హై స్టాండర్డ్లో ఉంటుంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు దిల్రాజు వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ "ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత దిల్రాజుతో వాయిస్ ఓవర్ చెప్పించడానికి ఓ ప్రత్యే కమైన కారణం ఉంది. అది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందంటున్నారు సినిమా టీమ్. దర్శకుడు క్రాంతి మాధవ్ సిని మాను అద్భుతంగా తెరకెక్కించారు. కథలో భాగంగా వచ్చే కామెడీ ప్రేక్ష కులను నవ్విస్తుంది. ప్రకాష్రాజ్ కాంబినేషన్లో వచ్చే డైలాగ్స్ అందరినీ ఆలోచింపచేసే విధంగా ఉంటాయి. సునీల్ పాత్ర నవ్విస్తూ అందరినీ ఆలోచింపచేస్తుంది.
పాటలన్నీ ప్రేక్షకాదరణ పొందడం ఆనందంగా ఉం ది. పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, అలీ, ఆశిష్ విద్యార్థి, రాజా రవీంద్రల పాత్రలు అందరినీ అలరిస్తాయి"అని అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







