మోటార్ బైకులపై దొంగతనాలు చేసే ముఠా పట్టివేత
- September 07, 2017
కువైట్ : ఆరుగురు సభ్యులు గల ఒక దొంగల ముఠా ఇటీవల పోలీసులకు పట్టుబడింది. వీరికి అనేక దొంగతనాలతో సంబంధం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆ ముఠాను అరెస్టు చేశారు. భద్రతా వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ఈ అనుమానితులు ఏడు బైకులను ఉపయోగించి చోరీలకు పాల్పడతారు. ఈ దొంగలు బైకులపై వేగంగా వచ్చి బాధితుల వెనుకనుంచి మొబైల్ ఫోన్లు, వెనుక తగిలించుకున్నసంచులు లేదా వారు తీసుకువెళుతున్న ఇతర విలువైన వస్తువులను లాక్కొని అక్కడ్నుంచి మాయమయ్యేవారు. అంతేకాకుండా ఈ అనుమానితులు పలు వాహనాలను కిటికీ అద్దాలను పగులగొట్టి అందులో ఉన్న పలు విలువైన వస్తువులను సైతం దొంగిలించారని భద్రతా వర్గాలు తెలిపాయి. ఆరుగురు సభ్యులు గల ఈ దొంగల ముఠాపై మొత్తం 23 దోపిడీ కేసులలో ప్రధాన నిందితులుగా ఉన్నట్లు వారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







