కడుపు పండాలంటే.. ద్రాక్షపండ్లు ఎక్కువగా తీసుకోండి
- September 07, 2017
ద్రాక్ష పండ్లలో పిండిపదార్థాలు, చక్కెర పదార్థాలతో పాటు విటమిన్ -ఎ, విటమిన్-బి1 విటమిన్లు పుష్కలంగా వుంటాయి. విటమిన్ సి, విటమిన్-కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్ లాంటి ఖనిజ లవణాలు మెండుగా ఉంటాయి. ద్రాక్ష వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మూత్రపిండ సమస్యలతో బాధపడే వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.
కొలెస్ట్రాల్ను అదుపు చేయడం, క్యాన్సర్ను ఎదుర్కోవడంలో కూడా ద్రాక్ష ఉపయోగపడుతుంది. ఆస్తమా, గుండె జబ్బులు, అజీర్ణం, మైగ్రేయిన్.. ఇలా చాలా రోగాలకు ద్రాక్ష అద్భుతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పండ్లుగానే తినడంతో పాటు పానీయంగా, సలాడ్లుగా కూడా ద్రాక్షను తీసుకోవడం మంచిది.
సంతానలేమితో ఇబ్బంది పడే దంపతులు.. ఎక్కువగా ద్రాక్ష పండ్లు తినడం ద్వారా కడుపు పండేందుకు అవకాశాలు మెరుగవుతాయి. ద్రాక్ష పండ్లతోపాటు బ్లూబెర్రీలు, వేరుశనగలోనూ ఉండే యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా వుండటంతో సంతానలేమిని దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









