ఫ్రీ మెడికల్ క్యాంప్ని నిర్వహించిన పిడబ్ల్యుఎస్
- September 07, 2017
జెడ్డా: పాకిస్తాన్ వెల్ఫేర్ సొసైటీ, శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు పాకిస్తాన్ కాన్సులేట్లోని కమ్యూనిటీ హాల్లో ఉచిత మెడికల్ క్యాంప్ని నిర్వహించనుంది. వెస్టర్న్ ప్రావిన్స్లో పాకిస్తానీ వలసదారులు ఈ సోషల్ మరియు వెల్ఫేర్ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేశారు. ఉచిత మెడికల్ క్యాంప్, అలాగే ఐ క్లినిక్ని కూడా నిర్వహిస్తున్నారు. క్యాంప్ ఇన్ఛార్జ్ మొహమ్మద్ అబ్దుల్ సత్తార్ యూనస్ మాట్లాడుతూ, మెడికల్ క్యాంప్లో స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటారనీ, పేషెంట్లకు ఉచితంగా మందులు అందజేస్తారని చెప్పారు. అల్ట్రా సౌండ్, ఎకో పరీక్షల్ని కూడా ఇక్కడ నిర్వహిస్తారు. రక్త పరీక్షలు కూడా ఉచితంగానే ఈ క్యాంప్లో చేస్తారు. పిడబ్ల్యుఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఖలీల్ ఉర్ రెహ్మాన్ మాట్లాడుతూ, ఉపయోగం లేని, ఎక్స్పైరీ డేట్ పూర్తి కాని మెడిసిన్స్ని పిడబ్ల్యుఎస్ క్యాంప్కి డొనేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







