ఫ్రీ మెడికల్ క్యాంప్ని నిర్వహించిన పిడబ్ల్యుఎస్
- September 07, 2017
జెడ్డా: పాకిస్తాన్ వెల్ఫేర్ సొసైటీ, శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు పాకిస్తాన్ కాన్సులేట్లోని కమ్యూనిటీ హాల్లో ఉచిత మెడికల్ క్యాంప్ని నిర్వహించనుంది. వెస్టర్న్ ప్రావిన్స్లో పాకిస్తానీ వలసదారులు ఈ సోషల్ మరియు వెల్ఫేర్ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేశారు. ఉచిత మెడికల్ క్యాంప్, అలాగే ఐ క్లినిక్ని కూడా నిర్వహిస్తున్నారు. క్యాంప్ ఇన్ఛార్జ్ మొహమ్మద్ అబ్దుల్ సత్తార్ యూనస్ మాట్లాడుతూ, మెడికల్ క్యాంప్లో స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటారనీ, పేషెంట్లకు ఉచితంగా మందులు అందజేస్తారని చెప్పారు. అల్ట్రా సౌండ్, ఎకో పరీక్షల్ని కూడా ఇక్కడ నిర్వహిస్తారు. రక్త పరీక్షలు కూడా ఉచితంగానే ఈ క్యాంప్లో చేస్తారు. పిడబ్ల్యుఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఖలీల్ ఉర్ రెహ్మాన్ మాట్లాడుతూ, ఉపయోగం లేని, ఎక్స్పైరీ డేట్ పూర్తి కాని మెడిసిన్స్ని పిడబ్ల్యుఎస్ క్యాంప్కి డొనేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









