అందాల నటి సావిత్రి తన ఆఖరి రోజులు కార్ షెడ్ లోనే గడిపారు

- September 08, 2017 , by Maagulf
అందాల నటి సావిత్రి తన ఆఖరి రోజులు కార్ షెడ్ లోనే గడిపారు

నటి సావిత్రి గురించి ఆసక్తికర వివరాలు వెల్లడించారు ఆమె సన్నిహితురాలు... ప్రముఖ పాటల రచయిత ఆరుద్ర సతీమణి రామలక్ష్మి. ఇటివలే ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ....సావిత్రి రూపం తగ్గట్టు గానే చాలా మంచి మనిషి. తన ఇంటికి ఎవరు వచ్చినా చేయికడిగి వెళ్లాల్సిందే. ఆమె ఎన్నో కష్టాలు అనుభవించింది. ధైర్యంతో వాటాన్నింటినీ ఎదుర్కుంది. జెమినీ గణేషన్ ను వివాహం చేసుకున్న సావిత్రికి విజయచాముండేశ్వరి, సతీష్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కష్టాల్లో ఉన్నవారిని, ఆమె సహాయం కోరి వచ్చినవారిని ఆమె ఎప్పుడు కాదనలేదు. ఆమె ఆశ్రయం కొరి వచ్చిన వారికి ఆదరించడంలో సావిత్రిని మించినవారు లేరు అంటే అతిశయోక్తికాదేమో. కానీ ఆమె చివరి రోజుల్లో దుర్భరమైన దారిద్ర్యం అనుభవించారని....తుది శ్వాస విడిచే వరకు ఆమె కారు షెడ్డులో జీవనం కొనసాగించారని రామలక్ష్మి తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com