మణిరత్నం దర్శకత్వంలో జ్యోతిక
- September 08, 2017
చెలియా సినిమాతో మరోసారి నిరాశపరిచిన లెజెండరీ దర్శకుడు మణిరత్నం తన నెక్ట్స్ సినిమాకు రెడీ అవుతున్నారు. విజయ్ సేతుపతి ఫహాద్ ఫాజిల్ లు హీరోలుగా ఓ మల్టీ స్టారర్ సినిమాను మణిరత్నం ప్లాన్ చేస్తున్నట్టుగా కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. తాజాగా సీనియర్ హీరోయిన్ జ్యోతిక తాను త్వరలో మణిరత్నం దర్శకత్వంలో నటించనున్నట్టుగా ప్రకటించారు.
ప్రస్తుతం బాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాచియార్ షూటింగ్ లో బిజీగా ఉన్న జ్యోతిక తన నెక్ట్స్ సినిమాను ఎనౌన్స్ చేశారు. అయితే సినిమాకు సంబంధించిన విశేషాలు వెల్లడించకపోయినా.. మణిరత్నం పర్మిషన్ తాను ఆ సినిమాలో నటిస్తున్నట్టుగా తెలిపానన్నారు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న మగలిర్ మట్టుం ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జ్యోతిక ఈ విషయాలను వెల్లడించారు.
పెళ్లి తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న జ్యోతిక 2015లో 36 వయదినిలే సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. రిలీజ్ కు రెడీ అయిన మగలిర్ మట్టుం సినిమాలో డాక్యుమెంటరీ ఫిలింమేకర్ గానటించిన జ్యోతిక, నాచియార్ లో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







