మస్కట్ అపోలో హాస్పిటల్లో చిన్నపిల్లల వ్యాధి ' తలాసేమియా ' క్లినిక్ ప్రారంభం

- September 14, 2017 , by Maagulf
మస్కట్ అపోలో హాస్పిటల్లో చిన్నపిల్లల వ్యాధి ' తలాసేమియా ' క్లినిక్ ప్రారంభం

మస్కట్ : గత కొన్ని సంవత్సరాలుగా చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చిన్నపిల్లల వ్యాధి ' తలాసేమియా '  ఒమన్ కు చెందిన100 మందికి పైగా పిల్లలు చికిత్స పొందుతున్నారు. వంశపారంర్యంగా వచ్చే రక్త దోషములకి  ( తలాసేమియా ) సంబంధించిన ఈ వ్యాధితో  ఒమన్ లో1,000 మంది పిల్లల కేసులలో దాదాపు 110 మంది చిన్నారులకు ఇక్కడ  విజయవంతమైన చికిత్సను అందిస్తున్నట్లు సోమవారం మస్కట్ అపోలో హాస్పిటల్  మొదటి అంతర్జాతీయ పీడియాట్రిక్ తలాసేమియా క్లినిక్ ను  ప్రారంభించినట్లు అపోలో హాస్పిటల్స్ గ్రూపు అధ్యక్షుడు డాక్టర్ కె. హరిప్రసాద్ తెలిపారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ అపోలో హాస్పిటల్ ను మస్కట్ లో ఈ క్లినిక్ ప్రారంభోత్సవం ప్రకటించటం ఆనందంగా ఉంది. చెన్నైలోని మా ఆసుపత్రిలో ఎముకలలోని మూలుగ మార్పిడి  బోన్ మారో ట్రాన్స్ప్లాంట్స్ (బి ఏం టి ) ఈ ప్రత్యేకమైన వైద్యం ఉందని అన్నారు , ఇక్కడ వైద్యులు అమెరికా సంయుక్త, బ్రెజిలియన్ మరియు ఇండియన్ రిజిస్ట్రీలోని నేషనల్ మారో దొనెర్ ప్రోగ్రామ్ లో సైతం పనిచేసిన అనుభవం ఉందని తెలిపారు  ఈ సేవను 40 దేశాల నుండి రోగులకు అందించడానికి మేము విశేషంగా కృషిచేస్తున్నట్లు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com