మస్కట్ అపోలో హాస్పిటల్లో చిన్నపిల్లల వ్యాధి ' తలాసేమియా ' క్లినిక్ ప్రారంభం
- September 14, 2017
మస్కట్ : గత కొన్ని సంవత్సరాలుగా చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చిన్నపిల్లల వ్యాధి ' తలాసేమియా ' ఒమన్ కు చెందిన100 మందికి పైగా పిల్లలు చికిత్స పొందుతున్నారు. వంశపారంర్యంగా వచ్చే రక్త దోషములకి ( తలాసేమియా ) సంబంధించిన ఈ వ్యాధితో ఒమన్ లో1,000 మంది పిల్లల కేసులలో దాదాపు 110 మంది చిన్నారులకు ఇక్కడ విజయవంతమైన చికిత్సను అందిస్తున్నట్లు సోమవారం మస్కట్ అపోలో హాస్పిటల్ మొదటి అంతర్జాతీయ పీడియాట్రిక్ తలాసేమియా క్లినిక్ ను ప్రారంభించినట్లు అపోలో హాస్పిటల్స్ గ్రూపు అధ్యక్షుడు డాక్టర్ కె. హరిప్రసాద్ తెలిపారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ అపోలో హాస్పిటల్ ను మస్కట్ లో ఈ క్లినిక్ ప్రారంభోత్సవం ప్రకటించటం ఆనందంగా ఉంది. చెన్నైలోని మా ఆసుపత్రిలో ఎముకలలోని మూలుగ మార్పిడి బోన్ మారో ట్రాన్స్ప్లాంట్స్ (బి ఏం టి ) ఈ ప్రత్యేకమైన వైద్యం ఉందని అన్నారు , ఇక్కడ వైద్యులు అమెరికా సంయుక్త, బ్రెజిలియన్ మరియు ఇండియన్ రిజిస్ట్రీలోని నేషనల్ మారో దొనెర్ ప్రోగ్రామ్ లో సైతం పనిచేసిన అనుభవం ఉందని తెలిపారు ఈ సేవను 40 దేశాల నుండి రోగులకు అందించడానికి మేము విశేషంగా కృషిచేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







