సనాతన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల తో శోభాయమానంగా వెలుగుతున్న గల్ఫ్ తీరం
- October 31, 2015
గల్ఫ్
గత కొంతకాలం వరకు కూడా కేవలం ఒక సామాజిక ధర్మానికే ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన ధర్మాలకు అడ్డుకట్ట వేసే వారని, పరమత సహనం తక్కువని ఒక పెద్ద అపవాదు ప్రాచుర్యం లో ఉండేది. అయితే ప్రస్తుతం ఆ మాట మరుగున పడి భిన్నత్వం లో ఏకత్వం దిశగా సాగి పోతోంది ఈ తీరం. ప్రపంచ దేశాలలో భారత దేశం తరువాత , అగ్ర రాజ్యాలకు దీటుగా, ఒక వైపు తమ రాజరిక పంధాను కొనసాగిస్తూనే మరో వైపు ప్రజాస్వామ్య వ్యవస్థ కు స్ఫూర్తి గా నిలుస్తూ చరిత్ర లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటోంది.
అందుకే గత దశాబ్ద కాలం లో ఎన్నడూ లేనంత స్థాయి లో సనాతన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల వెలుగు రేఖల కేంద్ర బిందువై అలరారుతోంది. ఇది గొప్ప శుభ పరిణామం గా చెప్పుకోవచ్చు .
ముఖ్యంగా భారతీయుల విషయానికి వచ్చినట్లయితే సనాతనం అంటే ప్రాణమని, అనుష్టాన బలం తో ఆత్మను ప్రణవ శక్తీ తో లయం చేసి, ధార్మిక పరిరక్షణ అనే జీవనది లో నీటి బిందువులు గా మారి తమ జన్మ సార్ధకత కై నిరంతరం శ్రమించే ఔన్నత్యం కలిగినవారు.
వేదోప బ్రహ్మణ మైన చతు:షష్టి కళలు ఆ నిర్వికార, నిరామయుని లీలా సాదృశ్యం గా భావించి అజరామరమైన శాస్త్రీయ సంగీత, నృత్య, అభినయాలతో కళాంజలి అర్పిస్తూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేసి ఈ గల్ఫ్ తీరాన్ని సుశోభితం చేస్తున్న సిరి ( ధార్మిక సిరి ) కలిగిన శ్రీమంతులకు అభివందనములు. ఇటువంటి శ్రీమంతులకు ఆవాసాన్ని కల్పించిన ఇక్కడి సామ్రాజ్య సార్వ భౌములకు ఆత్మీయ అభివాదం తెలుపుతూ నా ఈ గల్ఫ్ తీరం కీర్తి ఆచంద్ర తారర్కమై శోభిల్లాలని కోరుకుంటూ
మీ లో ఒకడు
సుబ్రహ్మణ్య శర్మ, UAE
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







