షావుకారు జానకి కి కన్నడ రాజ్యోత్సవ పురస్కారo
- November 01, 2015
సుప్రసిద్ధ నటీమణి షావుకారు జానకిని కర్ణాటక ప్రభుత్వం నేడు సత్కరించనున్నది. కన్నడ రాజ్యోత్సవ పురస్కారాన్ని బహూకరించనున్నది. కర్ణాటక ప్రభుత్వం 60మంది ప్రముఖులను కన్నడ రాజ్యోత్సవ పురస్కారంతో సత్కరిస్తున్నది. ఈ పురస్కారం కింద లక్ష రూపాయిల నగదు, 20 గ్రాముల సువర్ణ పతకాన్ని, సన్మాన పత్రాన్ని అందజేస్తారు. షావుకారు జానకిగా ప్రసిద్ధి చెందిన శంకరమంచి జానకి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సువర్ణాధ్యాయం అనదగ్గ కాలంలో పలు చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన షావుకారు చిత్రం పేరే ఆమె ఇంటిపేరుగా సార్థకమైంది. ప్రస్తుతం ఆమె బెంగళూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









