రియల్ లైఫ్ లోనూ ప్రభాస్ హీరోయే
- September 29, 2017
కేంద్రం ప్రభుత్వం తలపెట్టిన 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ దేశంలోని పలువురు ప్రముఖులకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే. ఇందులో బాగంగా టాలీవుడ్ కు సంబధించి.. రాజమౌళి, మోహన్బాబు, ప్రభాస్, మహేశ్బాబు తదితరులకు నరేంద్రమోదీ లేఖలు రాశారు.
ఈ లేఖపై తాజాగా ప్రభాస్ స్పదించాడు. " డియర్ ఆల్. పరిశుభ్రతకు ఎంతో విలువిచ్చిన మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో నేనూ భాగస్వామ్యం కావాలని అనుకుంటున్నాను. నా దేశాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడం ఓ పౌరుడిగా అది నా బాధ్యతే కాదు అలవాటు కూడా. నాలాగే మీరూ ఆలోచించి భారతదేశం శుభ్రంగా ఉండేలా మీ వంతు కృషిచేయాలని ఆశిస్తున్నాను. ఇప్పుడున్న దానికంటే మన దేశం మరింత అందంగా తయారవుతుంది. జై హింద్" అని సోషల్ మీడియా వేదికగా కోరాడు ప్రభాస్.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







