కువైట్ అవెన్యూలో ఒక దారి తాత్కాలికంగా మూసివేత
- September 29, 2017మనామా: ఉమ్ ఆళ్హస్సం జంక్షన్ సమీపంలో కువైట్ అవెన్యూలో విద్యుత్ కేబుల్స్ ను ఏర్పాటుచేసే పని తప్పనిసరి కాబడిందని ప్రజలకు ప్రకటించారు. దీంతో ఉత్తర దిక్కున ఉన్న ఎడమ దారిని మూసివేసి మనామాకు దారితీసే ట్రాఫిక్ ను వేరే ఒక దారి వైపునకు మళ్ళించబడుతుందని వర్క్స్, మునిసిపాలిటీ వ్యవహారాల మరియు అర్బన్ ప్లానింగ్ పథక అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ మల్లింపును ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ తో సహకారంతో అమలుచేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దారి మూసివేత 29 వ తేదీ శుక్రవారం రాత్రి 11:00 గంటల నుండి అక్టోబర్ 2 వ తేదీ సోమవారం ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుంది. ఈ రహదారిని ఉపయోగించుకొనేవారందరు పైన పేర్కొన్న విషయాలను పరిగణన లోనికి తీసుకోవాలని కోరారు. అలాగే వాహనదారుల భద్రత కోసం ట్రాఫిక్ నియమాలను గమనించి వాటిని పాటించాలని తద్వారా సురక్షిత ప్రయాణం ఈ మార్గంలో కొనసాగించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- ఉమ్మడి సహకారం.. ఇండియాతో కువైట్ ఒప్పందం
- జీసీసీ పౌరులకు శుభవార్త..ఇక 5 ఏళ్ల వీసాలు మంజూరు
- దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు..!