కువైట్ అవెన్యూలో ఒక దారి తాత్కాలికంగా మూసివేత
- September 29, 2017
మనామా: ఉమ్ ఆళ్హస్సం జంక్షన్ సమీపంలో కువైట్ అవెన్యూలో విద్యుత్ కేబుల్స్ ను ఏర్పాటుచేసే పని తప్పనిసరి కాబడిందని ప్రజలకు ప్రకటించారు. దీంతో ఉత్తర దిక్కున ఉన్న ఎడమ దారిని మూసివేసి మనామాకు దారితీసే ట్రాఫిక్ ను వేరే ఒక దారి వైపునకు మళ్ళించబడుతుందని వర్క్స్, మునిసిపాలిటీ వ్యవహారాల మరియు అర్బన్ ప్లానింగ్ పథక అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ మల్లింపును ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ తో సహకారంతో అమలుచేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దారి మూసివేత 29 వ తేదీ శుక్రవారం రాత్రి 11:00 గంటల నుండి అక్టోబర్ 2 వ తేదీ సోమవారం ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుంది. ఈ రహదారిని ఉపయోగించుకొనేవారందరు పైన పేర్కొన్న విషయాలను పరిగణన లోనికి తీసుకోవాలని కోరారు. అలాగే వాహనదారుల భద్రత కోసం ట్రాఫిక్ నియమాలను గమనించి వాటిని పాటించాలని తద్వారా సురక్షిత ప్రయాణం ఈ మార్గంలో కొనసాగించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్లకు బలవుతున్న ఇన్వెస్టర్లు..!!
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి.. తీవ్రంగా ఖండించిన ఒమన్..!!
- సార్ కారు ప్రమాదం.. మూడుకు చెరిన మృతుల సంఖ్య..!!
- స్పెషల్ ఆపరేషన్.. ఖైతాన్లో 20 మంది ప్రవాసులు అరెస్టు..!!
- యూఏఈ ఉద్దేశపూర్వకంగా 3 నౌకలను ఎందుకు ముంచివేసిందంటే..!!
- సౌదీ అరేబియాలో 2,400 మందికి పైగా స్మగ్లర్లు అరెస్టు..!!
- ఈ కార్ రేసు కేసులో కెటిఆర్ కు ఎసిబి పిలుపు
- మొబైల్ వినియోగదారులకి టెలికాం శాఖ గుడ్ న్యూస్
- హైదరాబాద్ లో రెచ్చిపోతున్న రాజస్థాన్ దొంగలు
- ఇరాన్పై ఇజ్రాయెల్ వార్..ముడి చమురు ధరలకు రెక్కలు!