కువైట్ అవెన్యూలో ఒక దారి తాత్కాలికంగా మూసివేత
- September 29, 2017
మనామా: ఉమ్ ఆళ్హస్సం జంక్షన్ సమీపంలో కువైట్ అవెన్యూలో విద్యుత్ కేబుల్స్ ను ఏర్పాటుచేసే పని తప్పనిసరి కాబడిందని ప్రజలకు ప్రకటించారు. దీంతో ఉత్తర దిక్కున ఉన్న ఎడమ దారిని మూసివేసి మనామాకు దారితీసే ట్రాఫిక్ ను వేరే ఒక దారి వైపునకు మళ్ళించబడుతుందని వర్క్స్, మునిసిపాలిటీ వ్యవహారాల మరియు అర్బన్ ప్లానింగ్ పథక అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ మల్లింపును ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ తో సహకారంతో అమలుచేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దారి మూసివేత 29 వ తేదీ శుక్రవారం రాత్రి 11:00 గంటల నుండి అక్టోబర్ 2 వ తేదీ సోమవారం ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుంది. ఈ రహదారిని ఉపయోగించుకొనేవారందరు పైన పేర్కొన్న విషయాలను పరిగణన లోనికి తీసుకోవాలని కోరారు. అలాగే వాహనదారుల భద్రత కోసం ట్రాఫిక్ నియమాలను గమనించి వాటిని పాటించాలని తద్వారా సురక్షిత ప్రయాణం ఈ మార్గంలో కొనసాగించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









