మస్కట్ లో ప్రవాసుల పూల పండుగ
- October 01, 2017

మస్కట్: ఒమాన్ తెలంగాణ సమితి (ఒమాన్ లోని ఇండియన్ సోషల్ క్లబ్, తెలంగాణ వింగ్) ఆధ్వర్యంలో మస్కట్ లో శుక్రవారం రాత్రి ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. జన్మభూమికి దూరంగా అన్యభూమి ఓమాన్ లో ఉన్న రెండువేలకు పైగా తెలంగాణ ప్రవాసీలు మస్కట్ లోని వాది కబీర్ లో గల మస్కట్ క్లబ్ లో ప్రవాసి బతుకమ్మ సంబరాలు సాంప్రదాయబద్దంగా ఘనముగా నిర్వహించారు. ఇండియా నుంచి వచ్చిన ప్రముఖ గాయకులు రాంపూర్ సాయి, తేలు విజయ లు తమ పాటలతో మస్కట్ లోని ప్రవాసులను అలరించారు.
ఇండియా నుండి తంగేడు తదితర పూలను తెప్పించుకుని పేర్చిన బతుకమ్మలు పూల జాతరను తలపించాయి. పరాయి దేశానికి వచ్చిన తామందరం ఒకే దగ్గర చేరి బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉందని, తమకు స్వదేశంలో ఉన్నఅనుభూతి కలిగిందని ఖానాపూర్ కు చెందిన ప్రముఖ భారతీయుడు, ఒమాన్ తెలంగాణ సమితి అధ్యక్షుడు గుండేటి గణేష్ తెలిపారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









