సినీ నటుడు మోహన్బాబుకు గౌరవ డాక్టరేట్
- October 01, 2017తెలుగు సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు మరో అరుదైన గౌరవం లభించనుంది. చెన్నైలోని ఎంజీఆర్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. ఈ విషయాన్ని ప్రముఖ హీరో, మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు.
ఈ గౌరవ డాక్టరేట్ను ఈనెల 4వ తేదీన అందుకోనున్నాడు. దీనిపై ఆయన చేసిన ట్వీట్లో... ‘కంగ్రాట్స్ నాన్నా.. ఎంతో గర్వపడే క్షణం’ అని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా మోహన్ బాబు ఫొటోను పోస్ట్ చేశాడు.
కాగా, సినీ నటుడిగా, నిర్మాతగా, రాజకీయవేత్తగా మోహన్ బాబు తనదైన ముద్ర వేశారు. సుమారు 560 చిత్రాల్లో నటించిన ఆయన, టీడీపీ తరపున గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2007లో ‘పద్మశ్రీ’ పురస్కారంతో మోహన్ బాబును భారత ప్రభుత్వం గౌరవించిన విషయం తెల్సిందే.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!