వినూత్న ప్రయోగంతో వస్తున్న మంచు విష్ణు
- October 02, 2017చెన్నై: నిన్నటి వరకు అనువాద చిత్రాలతోనే తెలుగు హీరోలు తమిళ మార్కెట్లోకి వచ్చేవారు. ఇప్పుడు ఏకంగా ద్విభాషా చిత్రంలో తమిళంలోకి అడుగుపెడుతున్నారు మన హీరోలు. ఆ జాబితాలో నటుడు విష్ణు కూడా చేరారు. కురల్ 388 చిత్రం ద్వారా ఆయన తమిళ తెరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమా తెలుగులో ఓటర్గా తెరకెక్కుతోంది. సంపత్రాజ్, పోసాని కృష్ణమురళి, నాజర్, మునీస్కాంత్, బ్రహ్మానందంలు ఇతర తారాగణం. రామారీల్స్ బ్యానరుపై జాన్ సుదీర్కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూర్చుతున్నారు. రాజేష్ యాదవ్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. జీఎస్ గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి విష్ణు మాట్లాడుతూ తిరుక్కురల్లో ఏడు పదాలతో ప్రపంచంలోని నీతులన్నింటినీ తెలియజేశారు. అందులోని 388వ నీతి ఆధారంగా ఈ సినిమా కథను తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుత కాలానికి తగ్గట్లు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. నా తమిళ సినీరంగ ప్రవేశానికి ఈ సినిమా పూర్తిస్థాయిలో నప్పుతుందని నమ్ముతున్నా. ఇందులో ప్రేమ, యాక్షన్, హాస్యం అన్నీ కలగలసి ఉంటాయి.
విజయ దశమి రోజున సినీరంగ ప్రవేశం చేయడం ఆనందంగా ఉంది అని తెలిపారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..