బాలకృష్ణ కథానాయకుడిగా 'కర్ణ'

- October 09, 2017 , by Maagulf
బాలకృష్ణ కథానాయకుడిగా 'కర్ణ'

బాలకృష్ణ కథానాయకుడిగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. నయనతార కథా నాయిక. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకుడు. సి.కల్యాణ్‌ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో పతాక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. బాలకృష్ణ, నయనతార, ప్రకాష్‌రాజ్‌, మురళీమోహన్‌, బ్రహ్మానందం, నటాషాతో పాటు ప్రధాన తారాగణమంతా చిత్రీకరణలో పాల్గొంటోంది. ఈ చిత్రానికి 'కర్ణ' అనే పేరుని ఖరారు చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మొదట 'జయసింహ', 'రెడ్డిగారు' తదితర పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా చిత్రబృందం 'కర్ణ' అనే పేరు వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చిరంతన్‌ భట్‌

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com