బాలకృష్ణ కథానాయకుడిగా 'కర్ణ'
- October 09, 2017బాలకృష్ణ కథానాయకుడిగా సి.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. నయనతార కథా నాయిక. కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. సి.కల్యాణ్ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్లో పతాక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. బాలకృష్ణ, నయనతార, ప్రకాష్రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, నటాషాతో పాటు ప్రధాన తారాగణమంతా చిత్రీకరణలో పాల్గొంటోంది. ఈ చిత్రానికి 'కర్ణ' అనే పేరుని ఖరారు చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మొదట 'జయసింహ', 'రెడ్డిగారు' తదితర పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా చిత్రబృందం 'కర్ణ' అనే పేరు వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చిరంతన్ భట్
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?