కాలుష్యంలో ఇండియానే టాప్..
- October 20, 2017
ఇండియాలో కాలుష్యం పెరిగిపోతున్నది. ఒక్క 2015లోనే కాలుష్య సంబంధిత రోగాల కారణంగా ఇండియాలో 25 లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఈ విషయంలో ప్రపంచంలోనే ఇండియా తొలి స్థానంలో ఉంది. తాజాగా జరిగిన ఓ అంతర్జాతీయ స్థాయి అధ్యయనం ఈ చేదు నిజాన్ని వెల్లడించింది. 2015లో ఎయిడ్స్, టీబీ, మలేరియా రోగాల వల్ల చనిపోయిన వారి కంటే కాలుష్యం బారిన పడి చనిపోయిన వారి సంఖ్య మూడు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. అందులోనూ వాయు కాలుష్యం వల్లే 18 లక్షల మంది చనిపోయారు. ఇందులోనూ ఇండియానే టాప్. అదే ఏడాది నీటి కాలుష్యం వల్ల మరో 6.4 లక్షల మంది చనిపోయినట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఇందులో 70 శాతం మరణాలు, గుండె సంబంధిత, శ్వాసకోశ వ్యాధుల వల్లేనని ఈ అధ్యయనం తేల్చింది. ప్రతి దేశంలోనూ కాలుష్యం బారిన పడి ఎక్కువగా చనిపోతున్నది బలహీన వర్గాలే. ద లాన్సెట్ అనే సంస్థ ఈ స్టడీ నిర్వహించింది. ప్రపంచంలో వాయు కాలుష్యం వల్ల చనిపోయిన వారిలో 50 శాతానికిపైగా ఇండియా, చైనా వాళ్లేనని ఈ అధ్యయనం స్పష్టంచేసింది. ఇక ఈ కాలుష్యం వల్ల రోగాలు పెరిగి మెడికల్ ఖర్చులు కూడా తడిసి మోపెడవుతున్నాయి.
ప్రపంచంలోని పది మంచి పేరున్న దేశాలను చూస్తే కాలుష్యం కారణంగా ఎక్కువగా చనిపోతున్న వారు ఇండియా, బంగ్లాదేశ్లలోనే ఎక్కువగా ఉన్నారు. అంతేకాదు మరింత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కాలుష్య మరణాలు 50 శాతం వరకు పెరిగే ప్రమాదం ఉందని కూడా ఈ స్టడీ తేల్చింది. అంటే 2050లో ఈ మరణాలు 42 లక్షల నుంచి 66 లక్షలకు చేరే ప్రమాదం ఉంది.
ముఖ్యంగా ఇండియా ఉన్న దక్షిణాసియా, తూర్పు ఆసియా నగరాల్లో కాలుష్యం వేగంగా పెరగనుందని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య 16 శాతం పెరగగా.. అందులో ఇండియాలాంటి తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లోనే 92 శాతం మరణాలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం
- ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్
- NATS ఆధ్వర్యంలో ‘హైవే దత్తత’ కార్యక్రమం
- కర్ణాటకలో విదేశీ మహిళ పై దాడి
- ప్రాంతీయ సంక్షోభాలను అంతం చేయడానికి దౌత్యమే ఏకైక మార్గం..!!
- యునెస్కో-సుల్తాన్ హైథమ్ బహుమతి..సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు గుర్తింపు..!!
- యూఏఈ లాటరీ: తాజా డ్రా విజేతల సంఖ్యలు.. ఎవరికీ దక్కని జాక్పాట్..!!
- 10 ఏళ్ల జైలు శిక్ష, 10 మిలియన్ల సౌదీ రియాల్స్ జరిమానా..!!
- 105,000 మంది కార్మికులకు 94 మిలియన్ల బహ్రెయిన్ దినార్ల మద్దతు..!!
- కార్మికుల సమావేశంపై పీఏఎం చర్యలు.. క్రిమినల్ దర్యాప్తునకు రిఫర్..!!









