ఉత్తర కొరియాపై భారత్ ఆంక్షలు మరింత కఠినతరం
- October 20, 2017
ఉత్తరకొరియాతో వాణిజ్య సంబంధాలపై విధించిన నిబంధనలను భారత్ మరింత కఠినతరం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీజీఎఫ్టీ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) ఓ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఉత్తరకొరియా నుంచి వచ్చే ప్రత్యక్ష దిగుమతులు/ఎగుమతులు, సరఫరా, అమ్మకాలు, రవాణా, కొన్ని ప్రత్యేక వస్తువులపై నిషేధం విధిస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొంది. నిషేధం విధించిన వాటిల్లో శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులు, సహజ వాయువు లిక్విడ్స్, ముడిచమురు ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎగుమతి/దిగుమతి అవుతున్న సీఫుడ్, ముడి ఇనుము, టెక్స్టైల్స్తో పాటు ఇతర వస్తువులపై కఠినమైన నిబంధనలు విధించింది.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారత్, ఉత్తరకొరియా మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలు క్షీణించాయి. ఇరుదేశాల మధ్య గతేడాది 198.78 మిలియన్ డాలర్ల వ్యాపారం జరగ్గా 2016-17లో 133.43 మిలియన్ డాలర్ల వ్యాపారం మాత్రమే జరిగింది. వరుస క్షిపణి ప్రయోగాలతో ప్రపంచ దేశాలకు తలనొప్పిగా మారిన ఉత్తరకొరియాను కట్టడి చేసేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆదేశంపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉ.కొరియా నుంచి వచ్చే దిగుమతులు/ఎగుమతులపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి.
తాజా వార్తలు
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్







