ఉత్తర కొరియాపై భారత్ ఆంక్షలు మరింత కఠినతరం
- October 20, 2017ఉత్తరకొరియాతో వాణిజ్య సంబంధాలపై విధించిన నిబంధనలను భారత్ మరింత కఠినతరం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీజీఎఫ్టీ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) ఓ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఉత్తరకొరియా నుంచి వచ్చే ప్రత్యక్ష దిగుమతులు/ఎగుమతులు, సరఫరా, అమ్మకాలు, రవాణా, కొన్ని ప్రత్యేక వస్తువులపై నిషేధం విధిస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొంది. నిషేధం విధించిన వాటిల్లో శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులు, సహజ వాయువు లిక్విడ్స్, ముడిచమురు ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎగుమతి/దిగుమతి అవుతున్న సీఫుడ్, ముడి ఇనుము, టెక్స్టైల్స్తో పాటు ఇతర వస్తువులపై కఠినమైన నిబంధనలు విధించింది.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారత్, ఉత్తరకొరియా మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలు క్షీణించాయి. ఇరుదేశాల మధ్య గతేడాది 198.78 మిలియన్ డాలర్ల వ్యాపారం జరగ్గా 2016-17లో 133.43 మిలియన్ డాలర్ల వ్యాపారం మాత్రమే జరిగింది. వరుస క్షిపణి ప్రయోగాలతో ప్రపంచ దేశాలకు తలనొప్పిగా మారిన ఉత్తరకొరియాను కట్టడి చేసేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆదేశంపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉ.కొరియా నుంచి వచ్చే దిగుమతులు/ఎగుమతులపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు