ఉత్తర కొరియాపై భారత్ ఆంక్షలు మరింత కఠినతరం
- October 20, 2017
ఉత్తరకొరియాతో వాణిజ్య సంబంధాలపై విధించిన నిబంధనలను భారత్ మరింత కఠినతరం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీజీఎఫ్టీ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) ఓ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఉత్తరకొరియా నుంచి వచ్చే ప్రత్యక్ష దిగుమతులు/ఎగుమతులు, సరఫరా, అమ్మకాలు, రవాణా, కొన్ని ప్రత్యేక వస్తువులపై నిషేధం విధిస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొంది. నిషేధం విధించిన వాటిల్లో శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులు, సహజ వాయువు లిక్విడ్స్, ముడిచమురు ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎగుమతి/దిగుమతి అవుతున్న సీఫుడ్, ముడి ఇనుము, టెక్స్టైల్స్తో పాటు ఇతర వస్తువులపై కఠినమైన నిబంధనలు విధించింది.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారత్, ఉత్తరకొరియా మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలు క్షీణించాయి. ఇరుదేశాల మధ్య గతేడాది 198.78 మిలియన్ డాలర్ల వ్యాపారం జరగ్గా 2016-17లో 133.43 మిలియన్ డాలర్ల వ్యాపారం మాత్రమే జరిగింది. వరుస క్షిపణి ప్రయోగాలతో ప్రపంచ దేశాలకు తలనొప్పిగా మారిన ఉత్తరకొరియాను కట్టడి చేసేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆదేశంపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉ.కొరియా నుంచి వచ్చే దిగుమతులు/ఎగుమతులపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







