ఉత్తర కొరియాపై భారత్ ఆంక్షలు మరింత కఠినతరం
- October 20, 2017
ఉత్తరకొరియాతో వాణిజ్య సంబంధాలపై విధించిన నిబంధనలను భారత్ మరింత కఠినతరం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీజీఎఫ్టీ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) ఓ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఉత్తరకొరియా నుంచి వచ్చే ప్రత్యక్ష దిగుమతులు/ఎగుమతులు, సరఫరా, అమ్మకాలు, రవాణా, కొన్ని ప్రత్యేక వస్తువులపై నిషేధం విధిస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొంది. నిషేధం విధించిన వాటిల్లో శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులు, సహజ వాయువు లిక్విడ్స్, ముడిచమురు ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎగుమతి/దిగుమతి అవుతున్న సీఫుడ్, ముడి ఇనుము, టెక్స్టైల్స్తో పాటు ఇతర వస్తువులపై కఠినమైన నిబంధనలు విధించింది.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారత్, ఉత్తరకొరియా మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలు క్షీణించాయి. ఇరుదేశాల మధ్య గతేడాది 198.78 మిలియన్ డాలర్ల వ్యాపారం జరగ్గా 2016-17లో 133.43 మిలియన్ డాలర్ల వ్యాపారం మాత్రమే జరిగింది. వరుస క్షిపణి ప్రయోగాలతో ప్రపంచ దేశాలకు తలనొప్పిగా మారిన ఉత్తరకొరియాను కట్టడి చేసేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆదేశంపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉ.కొరియా నుంచి వచ్చే దిగుమతులు/ఎగుమతులపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









