జపాన్లో ఎన్నికలు.. మళ్లీ ప్రధాని షింజో అబే పార్టీ నెగ్గే అవకాశాలున్నాయి
- October 21, 2017జపాన్లో ఆదివారం పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో మళ్లీ ప్రధాని షింజో అబే పార్టీ నెగ్గే అవకాశాలున్నాయి. అబేకు చెందిన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఈ ఎన్నికల కోసం తీవ్రంగా ప్రచారం చేసింది. జాతీయ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రధాని అబే.. సెప్టెంబర్ నెలలో మళ్లీ ఎన్నికలకు పిలుపునిచ్చారు. నిజానికి అబేకు ప్రజాదరణ తక్కువే ఉన్నా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన కూటమికే విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. శాంతి భద్రతలు, ఉత్తర కొరియా సమస్యలు అబేకు ప్రశ్నార్థకంగా మారాయి. ఇటీవల నిర్వహించిన సర్వేలో కూడా అబేకు రేటింగ్ పడిపోయింది. కానీ రాజకీయంగా జపాన్లో అస్థిరత ఉన్నది. దీంతో ఆయన మళ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. ఒకవేళ రేపు జరిగే ఎన్నికల్లో షింజో అబే విక్టరీ సాధిస్తే.. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత దేశాన్ని అత్యధిక కాలం ఏలిన వ్యక్తిగా ఆయన నిలుస్తారు. 2006లో మొదటిసారి అబే ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. అప్పుడు కొంత కాలమే ఆయన ఆ సేవలు చేశారు.
ఆ తర్వాత 2012లో మళ్లీ జాతీయ ఎన్నికల్లో భారీ విక్టరీ సాధించారు. ఆర్థికపరంగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో షింజో అబే అనేక ప్రయత్నాలు చేశారు. కానీ మందకొడిగానే జపాన్ ముందుకు వెళ్లుతున్నది. అయితే జపాన్ను మళ్లీ అణుశక్తిగా మార్చేందుకు మాత్రం అబే ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది.
2011లో ఫుకుషిమా అణురియాక్టర్ దెబ్బతిన్న తర్వాత జపాన్ న్యూక్లియర్ పాలసీకి బ్రేక్ వేసింది. ఇప్పుడు మళ్లీ ఆ దిశగా జపాన్ అడుగులు వేయాలనుకుంటున్నది. దానికి షింజో అబే పూర్తిగా మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు మళ్లీ ప్రజలు పట్టం కట్టే సూచనలున్నాయి.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు