ఏపీ తో దుబాయ్ సంస్థల భారీ ఉప్పందం
- October 22, 2017ఏపీలో ఏరోసిటీ
ముఖ్యమంత్రి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తో అవగాహన ఒప్పందం
5.5 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ఏవియేషన్ సిటీ ఎల్ ఎల్ పీ సంసిద్ధత
ఇరవై వేల ఉద్యోగావకాశాలు
దుబాయి, అక్టోబర్ 22: ఆంధ్రప్రదేశ్ లో ఏరోసిటీ దశలవారీగా 5.5 బిలియన్ డాలర్ల పెట్టుబడితో యుఎఇ లోని మహ్మద్ అబ్దుల్ రెహమాన్ మహ్మద్ అల్ జూరానీ కి చెందిన ఏవియేషన్ సిటీ ఎల్ ఎల్ పీ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన ఎకనమిక్ డెలవప్మెంట్ బోర్డుకు, ఏవియేషన్ సిటీ ఎల్ ఎల్ పీకి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఏరో సిటీ పూర్తయితే 15,000 మందికి ప్రత్యక్షంగా, 5,000 మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఏవియేషన్ సిటీగా నిర్మించే ఏరోసిటీ నిర్మాణంలో అత్యంత అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తారు. దేశవిదేశాల నుంచి విజ్ఞానాన్ని తీసుకురావడం (Knowledge transfer) తమ ప్రాధాన్యమని ముఖ్యమంత్రి చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తున్న ప్రాజెక్టు అని అన్నారు. ఎక్కడ స్థాపించాలన్నదీ ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. ఏవియేషన్ సిటీ ఎల్ ఎల్ పీ ఏరోసిటీ స్థాపనకు 10 వేల ఎకరాలు అవసరమవుతుందని తెలిపింది. ఈ కంపెనీ బృందం ఈ మేరకు నవంబర్ మూడో వారంలో అధ్యయనానికి మన రాష్ట్రానికి రానున్నది. వచ్చే జనవరిలో దావోస్లో ప్రాథమిక నివేదిక అందజేస్తుంది.
తాజా వార్తలు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు