అందుబాటులోకి 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్' ఫీచర్
- October 27, 2017
ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం వాట్సాప్లో పొరపాటున మనం ఎవరికైనా సందేశం పంపితే దాన్ని తొలగించే అవకాశం లేదు. దీన్ని వల్ల అనేక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. మనం ఎవరికైనా పొరపాటున సందేశం పంపితే వెంటనే దాన్ని తొలగించుకునే వీలు కల్పించింది. డబ్ల్యూఏబీటా ఇన్ఫో వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొద్ది మందికి మాత్రమే వినియోగించుకునే వీలుంది.
మెస్సేజ్ రీకాల్ ఫీచర్ను దశల వారీగా అమలు చేస్తామని గతంలోనే వాట్సాప్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కొన్ని ఖాతాలకు మాత్రమే దీనిని అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ను కొత్త వెర్షన్తో అప్డేట్ చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్ను వినియోగించుకోవచ్చని తెలిపింది. టెక్ట్స్ సందేశాలు, చిత్రాలు, జిఫ్ ఫైల్స్, వీడియోలు, కాంటాక్ట్లు ఇలా అన్నింటినీ ఈ ఫీచర్ ద్వారా రీకాల్ చేసుకోవచ్చు.
అయితే ఈ మెసేజ్లు రీకాల్ అవ్వాలంటే అవతలి వ్యక్తి కూడా తన వాట్సాప్ను కొత్త వెర్షన్తో అప్డేట్ చేసుకోవాలి. కేవలం వ్యక్తిగత సందేశాలకు మాత్రమే కాకుండా గ్రూప్లో పొరపాటున పెట్టిన సందేశాలను కూడా రీకాల్ చేసుకోవచ్చు. అయితే అవతలి వ్యక్తి ఆ సందేశాలను చదివేలోపు మాత్రమే వాటిని తొలగించే వీలుంటుంది. దీనితో పాటు పంపిన సందేశాలను ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా వాట్సాప్ అందిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇది పనిచేయటం లేదని పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









