అందుబాటులోకి 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్' ఫీచర్
- October 27, 2017
ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం వాట్సాప్లో పొరపాటున మనం ఎవరికైనా సందేశం పంపితే దాన్ని తొలగించే అవకాశం లేదు. దీన్ని వల్ల అనేక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. మనం ఎవరికైనా పొరపాటున సందేశం పంపితే వెంటనే దాన్ని తొలగించుకునే వీలు కల్పించింది. డబ్ల్యూఏబీటా ఇన్ఫో వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొద్ది మందికి మాత్రమే వినియోగించుకునే వీలుంది.
మెస్సేజ్ రీకాల్ ఫీచర్ను దశల వారీగా అమలు చేస్తామని గతంలోనే వాట్సాప్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కొన్ని ఖాతాలకు మాత్రమే దీనిని అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ను కొత్త వెర్షన్తో అప్డేట్ చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్ను వినియోగించుకోవచ్చని తెలిపింది. టెక్ట్స్ సందేశాలు, చిత్రాలు, జిఫ్ ఫైల్స్, వీడియోలు, కాంటాక్ట్లు ఇలా అన్నింటినీ ఈ ఫీచర్ ద్వారా రీకాల్ చేసుకోవచ్చు.
అయితే ఈ మెసేజ్లు రీకాల్ అవ్వాలంటే అవతలి వ్యక్తి కూడా తన వాట్సాప్ను కొత్త వెర్షన్తో అప్డేట్ చేసుకోవాలి. కేవలం వ్యక్తిగత సందేశాలకు మాత్రమే కాకుండా గ్రూప్లో పొరపాటున పెట్టిన సందేశాలను కూడా రీకాల్ చేసుకోవచ్చు. అయితే అవతలి వ్యక్తి ఆ సందేశాలను చదివేలోపు మాత్రమే వాటిని తొలగించే వీలుంటుంది. దీనితో పాటు పంపిన సందేశాలను ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా వాట్సాప్ అందిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇది పనిచేయటం లేదని పేర్కొంది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







