అందుబాటులోకి 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్' ఫీచర్
- October 27, 2017
ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం వాట్సాప్లో పొరపాటున మనం ఎవరికైనా సందేశం పంపితే దాన్ని తొలగించే అవకాశం లేదు. దీన్ని వల్ల అనేక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. మనం ఎవరికైనా పొరపాటున సందేశం పంపితే వెంటనే దాన్ని తొలగించుకునే వీలు కల్పించింది. డబ్ల్యూఏబీటా ఇన్ఫో వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొద్ది మందికి మాత్రమే వినియోగించుకునే వీలుంది.
మెస్సేజ్ రీకాల్ ఫీచర్ను దశల వారీగా అమలు చేస్తామని గతంలోనే వాట్సాప్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కొన్ని ఖాతాలకు మాత్రమే దీనిని అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ను కొత్త వెర్షన్తో అప్డేట్ చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్ను వినియోగించుకోవచ్చని తెలిపింది. టెక్ట్స్ సందేశాలు, చిత్రాలు, జిఫ్ ఫైల్స్, వీడియోలు, కాంటాక్ట్లు ఇలా అన్నింటినీ ఈ ఫీచర్ ద్వారా రీకాల్ చేసుకోవచ్చు.
అయితే ఈ మెసేజ్లు రీకాల్ అవ్వాలంటే అవతలి వ్యక్తి కూడా తన వాట్సాప్ను కొత్త వెర్షన్తో అప్డేట్ చేసుకోవాలి. కేవలం వ్యక్తిగత సందేశాలకు మాత్రమే కాకుండా గ్రూప్లో పొరపాటున పెట్టిన సందేశాలను కూడా రీకాల్ చేసుకోవచ్చు. అయితే అవతలి వ్యక్తి ఆ సందేశాలను చదివేలోపు మాత్రమే వాటిని తొలగించే వీలుంటుంది. దీనితో పాటు పంపిన సందేశాలను ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా వాట్సాప్ అందిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇది పనిచేయటం లేదని పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









