మిస్టర్ ఇండియా సినిమా సీక్వెల్ తో శ్రీదేవి కూతురు ఎంట్రీ
- November 02, 2017
అతిలోక సుందరి శ్రీదేవి సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి మిస్టర్ ఇండియా... బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన ఈ సినిమా శేఖర్ కపూర్ దర్శకత్వంలో 1987 లో రిలీజైంది. అప్పట్లో ఓ రేంజ్ లో హిట్ అయిన ఈ సినిమాలో శ్రీదేవి అందాలు.. అనిల్ కపూర్ యాక్షన్, అమ్రిష్ పురి.. "మొగాంబో" అంటూ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అనిల్ కపూర్ ఇమేజ్ ని ఛేంజ్ చేసిన ఈ సినిమా కు సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారు శ్రీదేవి భర్త.. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్. కాగా ఈ సీక్వెల్ లో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటించనున్నట్లు బీ టౌన్ వర్గాల టాక్. ఈ సినిమాతో జాన్వి తెరం గ్రేటం చేయనున్నట్లు టాక్. మిస్టర్ ఇండియా సీక్వెల్ లో శ్రీదేవి పాత్రలో జాన్వి ని ఎంపిక చేసుకొనున్నట్లు.. తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారు అనేది తెలియాల్సి ఉన్నది. అంతేకాదు.. శ్రీదేవి గెస్ట్ రోల్ లో కనిపించనున్నదట.
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







