తాగుడు అలవాటున్న వారిని మాన్పించాలంటే..?
- November 03, 2017మానవ శరీరంలోని విషాలను బయటకు పంపించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో మెంతులు బాగా ఉపయోగపడతాయి. బిపి, షుగర్, అధిక బరువు లాంటి ఆరోగ్య సమస్యలే కాకుండా తాగుడుకు బానిసలైన వారి ఆరోగ్యాన్ని కాపాడి వారిని ఆ అలవాట్ల నుంచి దూరం చేయడంలోను మెంతులు బాగా ఉపయోగపడతాయి. మద్యాన్ని ఎక్కువగా సేవించడం వల్ల కాలేయం పూర్తిస్థాయిలో చెడిపోతుంది.
ఆల్కహాల్ కారణంగా రక్తనాళాలు దెబ్బతింటాయి. శ్వాస వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయదు. దీనికితోడు కడుపులో మంట, పేగుల్లో మంట వస్తుంది. దీనికి కిడ్నీ, మూత్ర పిండాల సమస్య కూడా తోడవుతుంది. తాగుడుకు బానిసలైన వారిని మెంతులతో ఈజీగా రక్షించుకోవచ్చు. తాగుడు అలవాటున్న వారికి రెండు స్పూన్ల మెంతిగింజలను సుమారు నాలుగు గంటల పాటు నీటిలో నానబెట్టి ఆ తరువాత ఉడకబెట్టి కొద్దిగా తేనె కలిపి తినిపించాలి.
ఇలా చేస్తే దెబ్బతిన్న కాలేయాన్ని కాపాడుకోవచ్చు. దానికితోడు మిశ్రమాన్ని క్రమంతప్పకుండా తీసుకుంటే మెంతుల్లోని చేదు, జిగురు తత్వాలు మద్యం అంటేనే ఒకరకరమైన అసహ్యాన్ని కలిగించేలా చేస్తాయి. ఎంత మద్యపానప్రియులైనా ఈ మెంతులను తిన్నాక మద్యం జోలికి అస్సలు వెళ్ళరు. మద్యంపైన ఆలోచన వెళ్ళినప్పుడు మెంతులతో చేసిన డికాక్షన్ తాగించాలి. ఇలా మెంతులు, మెంతు ఆకులను కలిపి తాగిస్తే తాగుడు అలవాటు నుంచి దూరం చేస్తాయి.
తాజా వార్తలు
- T20 వరల్డ్కప్.. ఏప్రిల్ 28న భారత జట్టు ఎంపిక..!
- ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తాం: సీఎం రేవంత్
- ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి: జస్టీస్ చంద్రచూడ్
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు