తాగుడు అలవాటున్న వారిని మాన్పించాలంటే..?
- November 03, 2017
మానవ శరీరంలోని విషాలను బయటకు పంపించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో మెంతులు బాగా ఉపయోగపడతాయి. బిపి, షుగర్, అధిక బరువు లాంటి ఆరోగ్య సమస్యలే కాకుండా తాగుడుకు బానిసలైన వారి ఆరోగ్యాన్ని కాపాడి వారిని ఆ అలవాట్ల నుంచి దూరం చేయడంలోను మెంతులు బాగా ఉపయోగపడతాయి. మద్యాన్ని ఎక్కువగా సేవించడం వల్ల కాలేయం పూర్తిస్థాయిలో చెడిపోతుంది.
ఆల్కహాల్ కారణంగా రక్తనాళాలు దెబ్బతింటాయి. శ్వాస వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయదు. దీనికితోడు కడుపులో మంట, పేగుల్లో మంట వస్తుంది. దీనికి కిడ్నీ, మూత్ర పిండాల సమస్య కూడా తోడవుతుంది. తాగుడుకు బానిసలైన వారిని మెంతులతో ఈజీగా రక్షించుకోవచ్చు. తాగుడు అలవాటున్న వారికి రెండు స్పూన్ల మెంతిగింజలను సుమారు నాలుగు గంటల పాటు నీటిలో నానబెట్టి ఆ తరువాత ఉడకబెట్టి కొద్దిగా తేనె కలిపి తినిపించాలి.
ఇలా చేస్తే దెబ్బతిన్న కాలేయాన్ని కాపాడుకోవచ్చు. దానికితోడు మిశ్రమాన్ని క్రమంతప్పకుండా తీసుకుంటే మెంతుల్లోని చేదు, జిగురు తత్వాలు మద్యం అంటేనే ఒకరకరమైన అసహ్యాన్ని కలిగించేలా చేస్తాయి. ఎంత మద్యపానప్రియులైనా ఈ మెంతులను తిన్నాక మద్యం జోలికి అస్సలు వెళ్ళరు. మద్యంపైన ఆలోచన వెళ్ళినప్పుడు మెంతులతో చేసిన డికాక్షన్ తాగించాలి. ఇలా మెంతులు, మెంతు ఆకులను కలిపి తాగిస్తే తాగుడు అలవాటు నుంచి దూరం చేస్తాయి.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









