దహీ సెవెన్ లీఫ్స్ వడలు
- November 03, 2017
కావలసిన పదార్థాల : తోటకూర - ఒక కట్ట, పాలకూర - ఒక కట్ట, చుక్కకూర - ఒక కట్ట, పుదీనా - ఒక కట్ట, కొత్తిమీర - ఒక కట్ట, కరివేపాకు - రెండు రెబ్బలు, గోంగూర - ఒక కట్ట, మినపపప్పు - అరకిలో, పచ్చిమిరపకాయలు - ఎనిమిది, చిక్కని పెరుగు - ఒక లీటరు, శెనగపప్పు - ఒక చెంచా, మినపపప్పు - అర చెంచా, జీలకర్ర - ఒక చెంచా, ఆవాలు -చెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద - రెండు చెంచాలు, ఉప్పు - తగినంత, ఎండుమిరపకాయలు - ఆరు, నూనె - తగినంత.
తయారీ విధానం: నానబెట్టి రుబ్బిన మినపపప్పులో ఉప్పు, పర్చిమిర్చి, ఆకు కూరల తురుము వేసి బాగా కలపాలి. దీన్ని వడలుగా వేసి బాగా వేయించుకోవాలి. తరువాత మరో స్టౌ మీద గిన్నె పెట్టి అందులో కొద్దిగా నూనె పోసి కాగాక సెనగపప్పు, మినపపప్పు, జీలకర్ర, ఆవాలు, అల్లంవెల్లుల్లి ముద్ద, ఉప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగాక పెరుగులో కలపాలి. ఇప్పుడు వేయించిన వడల్ని ఈ పెరుగులో వేయాలి. అంతే దహీ సెవెన్ లీవ్స్ వడలు రెడీ.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









