50 మిలియన్ల యూరోల ఖరీదైన సింథటిక్ ఓపియమ్ పెయిన్ కిల్లర్స్ స్వాధీనం

- November 04, 2017 , by Maagulf
50 మిలియన్ల యూరోల ఖరీదైన సింథటిక్ ఓపియమ్ పెయిన్ కిల్లర్స్ స్వాధీనం

సుమారు 50 మిలియన్ల యూరోలు విలువ చేసే సింథటిక్ ఓపియమ్ ట్యాబ్లెట్లను ఇటలీ పోలీసులు సీజ్ చేశారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ఉగ్రవాదులు ఈ మందులను లిబియాలో అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇండియా నుంచి లిబియాకు సరఫరా చేసిన 24 మిలియన్ల ట్రమడోల్ ట్యాబ్లెట్లను గియో టౌరో పోర్టు వద్ద సీజ్ చేశారు. ట్రమడోల్‌ను పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది. జిహాదీలు ఈ డ్రగ్‌ను ఎక్కువగా వాడుతారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ ట్యాబ్లెట్లను రెండు యూరోలకు ఒకటి చొప్పున అమ్ముతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఉగ్ర సంస్థలకు ఆర్థిక నిధులు అందజేసేందుకు ట్రమడోల్ మందును అమ్ముతున్నట్లు కూడా భావిస్తున్నారు. పెయిన్ కిల్లర్లు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులతో లిబియా, సిరియా, ఇరాక్ దేశాల్లో టెర్రర్ గ్రూపులకు ఆర్థిక సాయం అందుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com