మలేషియాను వణికిస్తున్న డామ్రే తుఫాన్‌

- November 06, 2017 , by Maagulf
మలేషియాను వణికిస్తున్న డామ్రే తుఫాన్‌

డామ్రే తుఫాన్‌ వియత్నాం, మలేషియాలను వణికిస్తోంది. వారం రోజులుగా కుండపోత వానలు, పెను గాలులు విరుచుకుపడుతున్నాయి. ఈ పెను బీభత్సానికి 32మంది చనిపోయారు. ముఖ్యంగా వియత్నాంలో పరిస్థితి దారుణంగా ఉంది. గంటకు 130 కిలోమీటర్లు వేగంతో వీస్తున్న గాలులతో 40వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లన్నీ చెరువుల్లా మారాయి. 

వియత్నాంలో ఎక్కడ చూసినా వర్ష బీభత్సం కనిపిస్తోంది. కూలిపోయిన ఇళ్లు, చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కనిపిస్తున్నాయి. పూర్తిగా జన జీవనం స్తంభించిపోయింది. ప్రభుత్వం సహాయక చర్యల్ని ముమ్మరం చేసింది. ఆర్మీని రంగంలోకి దించి జనాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరో నాలుగైదు రోజులు వానలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రెయిన్‌ అలర్ట్‌తో జనాలు భయపడిపోతున్నారు. 

మలేషియాలోనూ డామ్రే ప్రభావం కనిపిస్తోంది. ఏకధాటిగా 15 గంటల పాటు కురిసిన వర్షానికి కొన్నిచోట్ల 12 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోని మూడువేలమందికిపైగా ప్రజల్ని మలేషియా ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com