కారు ప్రమాదం: అగ్నికి ఆహుతైన వ్యక్తి
- November 06, 2017
20 ఏళ్ళ అరబ్ వ్యక్తి ఒకరు, కారు ప్రమాదంలో అగ్నికి ఆహుతయ్యారు. కారు టైర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. షార్జాలోని మ్లీహా రోడ్డులో సోమవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాఫిక్ అవేర్నెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మేజర్ అబ్దుల్ రహ్మాన్ ఖతెర్ మాట్లాడుతూ, కారు టైరు పేలిన వెంటనే, అదుపు తప్పిన కారు సిమెంట్ బ్యారియర్ని ఢీకొన్నట్లు చెప్పారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో వెంటనే, మంటలు వ్యాపించాయి. రెస్క్యూ సిబ్బంది సమాచారం అందుకుని, ఘటనా స్థలానికి చేరుకునేటప్పటికే, కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మంటల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు మృతదేహాన్ని 'మార్గ్యు'కి తరలించారు. కారుకి అగ్ని ప్రమాదం సంభవించిన విషయాన్ని వీడియోగా చిత్రీకరించి కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడాన్ని అధికారులు తప్పుపట్టారు. ఈ తరహా వీడియోల్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







