కారు ప్రమాదం: అగ్నికి ఆహుతైన వ్యక్తి
- November 06, 2017
20 ఏళ్ళ అరబ్ వ్యక్తి ఒకరు, కారు ప్రమాదంలో అగ్నికి ఆహుతయ్యారు. కారు టైర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. షార్జాలోని మ్లీహా రోడ్డులో సోమవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాఫిక్ అవేర్నెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మేజర్ అబ్దుల్ రహ్మాన్ ఖతెర్ మాట్లాడుతూ, కారు టైరు పేలిన వెంటనే, అదుపు తప్పిన కారు సిమెంట్ బ్యారియర్ని ఢీకొన్నట్లు చెప్పారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో వెంటనే, మంటలు వ్యాపించాయి. రెస్క్యూ సిబ్బంది సమాచారం అందుకుని, ఘటనా స్థలానికి చేరుకునేటప్పటికే, కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మంటల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు మృతదేహాన్ని 'మార్గ్యు'కి తరలించారు. కారుకి అగ్ని ప్రమాదం సంభవించిన విషయాన్ని వీడియోగా చిత్రీకరించి కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడాన్ని అధికారులు తప్పుపట్టారు. ఈ తరహా వీడియోల్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి









