డ్రైవర్ లేకుండాపోతున్న రైలును ఛేజ్ చేసి ఆపిన వైనం
- November 09, 2017డ్రైవర్ లేకుండానే రైలింజన్ పట్టాలపై పరుగులు తీస్తే.. అదీ.. ఏకధాటిగా 13 కిలోమీటర్ల మేర దూసుకుపోతే పరిస్థితి ఎలా ఉంటుంది.. అదే భీతావహ పరిస్థితి ఎదురైంది ఇవాళ. కర్నాటకలోని వాడి జంక్షన్లో రైలుకు ఇంజన్ మార్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే సడెన్ గా స్టార్ట్ అయిన డీజిల్ ఇంజన్ పట్టాలపైకి పరుగు లఘించుకుంది. ఇలా ఏకంగా 13కిలోమీటర్లు వెళ్లిపోయింది. ఇంజన్ ను ఆపేందుకు బైక్ తో ఛేజ్ చేసిన సిబ్బంది ఎలాగోలా ఇంజన్ లోకి వెళ్లి అదుపులోకి తెచ్చారు. తర్వాతి స్టేషన్ ను అప్రమత్తం చేయడంతో ఎలాంటి ప్రమాదం లేకుండా చేయగలిగామని అధికారులు చెబుతున్నారు. కర్ణాటకలోని వాడి జంక్షన్ నుంచి సోలాపూర్ మధ్యన ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల