డ్రైవర్ లేకుండాపోతున్న రైలును ఛేజ్ చేసి ఆపిన వైనం
- November 09, 2017
డ్రైవర్ లేకుండానే రైలింజన్ పట్టాలపై పరుగులు తీస్తే.. అదీ.. ఏకధాటిగా 13 కిలోమీటర్ల మేర దూసుకుపోతే పరిస్థితి ఎలా ఉంటుంది.. అదే భీతావహ పరిస్థితి ఎదురైంది ఇవాళ. కర్నాటకలోని వాడి జంక్షన్లో రైలుకు ఇంజన్ మార్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే సడెన్ గా స్టార్ట్ అయిన డీజిల్ ఇంజన్ పట్టాలపైకి పరుగు లఘించుకుంది. ఇలా ఏకంగా 13కిలోమీటర్లు వెళ్లిపోయింది. ఇంజన్ ను ఆపేందుకు బైక్ తో ఛేజ్ చేసిన సిబ్బంది ఎలాగోలా ఇంజన్ లోకి వెళ్లి అదుపులోకి తెచ్చారు. తర్వాతి స్టేషన్ ను అప్రమత్తం చేయడంతో ఎలాంటి ప్రమాదం లేకుండా చేయగలిగామని అధికారులు చెబుతున్నారు. కర్ణాటకలోని వాడి జంక్షన్ నుంచి సోలాపూర్ మధ్యన ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







