డ్రైవర్ లేకుండాపోతున్న రైలును ఛేజ్ చేసి ఆపిన వైనం

- November 09, 2017 , by Maagulf
డ్రైవర్ లేకుండాపోతున్న రైలును ఛేజ్ చేసి ఆపిన వైనం

డ్రైవర్ లేకుండానే రైలింజన్ పట్టాలపై పరుగులు తీస్తే.. అదీ.. ఏకధాటిగా 13 కిలోమీటర్ల మేర దూసుకుపోతే పరిస్థితి ఎలా ఉంటుంది.. అదే భీతావహ పరిస్థితి ఎదురైంది ఇవాళ. కర్నాటకలోని వాడి జంక్షన్లో రైలుకు ఇంజన్ మార్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే సడెన్ గా స్టార్ట్ అయిన డీజిల్ ఇంజన్ పట్టాలపైకి పరుగు లఘించుకుంది. ఇలా ఏకంగా 13కిలోమీటర్లు వెళ్లిపోయింది. ఇంజన్ ను ఆపేందుకు బైక్ తో ఛేజ్ చేసిన సిబ్బంది ఎలాగోలా ఇంజన్ లోకి వెళ్లి అదుపులోకి తెచ్చారు. తర్వాతి స్టేషన్ ను అప్రమత్తం చేయడంతో ఎలాంటి ప్రమాదం లేకుండా చేయగలిగామని అధికారులు చెబుతున్నారు. కర్ణాటకలోని వాడి జంక్షన్ నుంచి సోలాపూర్ మధ్యన ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com