డ్రైవర్ లేకుండాపోతున్న రైలును ఛేజ్ చేసి ఆపిన వైనం
- November 09, 2017
డ్రైవర్ లేకుండానే రైలింజన్ పట్టాలపై పరుగులు తీస్తే.. అదీ.. ఏకధాటిగా 13 కిలోమీటర్ల మేర దూసుకుపోతే పరిస్థితి ఎలా ఉంటుంది.. అదే భీతావహ పరిస్థితి ఎదురైంది ఇవాళ. కర్నాటకలోని వాడి జంక్షన్లో రైలుకు ఇంజన్ మార్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే సడెన్ గా స్టార్ట్ అయిన డీజిల్ ఇంజన్ పట్టాలపైకి పరుగు లఘించుకుంది. ఇలా ఏకంగా 13కిలోమీటర్లు వెళ్లిపోయింది. ఇంజన్ ను ఆపేందుకు బైక్ తో ఛేజ్ చేసిన సిబ్బంది ఎలాగోలా ఇంజన్ లోకి వెళ్లి అదుపులోకి తెచ్చారు. తర్వాతి స్టేషన్ ను అప్రమత్తం చేయడంతో ఎలాంటి ప్రమాదం లేకుండా చేయగలిగామని అధికారులు చెబుతున్నారు. కర్ణాటకలోని వాడి జంక్షన్ నుంచి సోలాపూర్ మధ్యన ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..









