బంగ్లాదేశ్లో 30 హిందువుల ఇళ్ళు దగ్ధం
- November 11, 2017
బంగ్లాదేశ్లో గుర్తు తెలియని వ్యక్తులు హిందువుల ఇళ్లపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. రంగ్పూర్ జిల్లా థాకుర్పారా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామంలో మైనార్టీ కమ్యూనిటీకి చెందిన ఓ యువకుడు ఫేస్బుక్లో అభ్యంతరకరమైన పోస్టు చేసినట్లు పుకార్లు వ్యాపించడంతో ఆందోళనకారులు దాడికి దిగారు. చుట్టుపక్కల ఆరు, ఏడు గ్రామాలకు చెందిన దాదాపు 20వేల మంది ఆందోళనకారులు థాకుర్పారా గ్రామంలోని హిందువులపై దాడి చేశారు. హిందువులకు చెందిన 30 ఇళ్లను కొల్లగొట్టి వాటికి నిప్పుపెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.
శాంతి, భద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించి, రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగ్రాతులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనకు సంబంధించి 33 మంది ఆందోళనాకారులను నిర్బంధించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కాల్పులు జరపడాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు రంగ్పూర్-దినాజ్పూర్ హైవేపై ఆందోళనకు దిగారు. రహదారిని మూసివేసి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









