బంగ్లాదేశ్లో 30 హిందువుల ఇళ్ళు దగ్ధం
- November 11, 2017బంగ్లాదేశ్లో గుర్తు తెలియని వ్యక్తులు హిందువుల ఇళ్లపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. రంగ్పూర్ జిల్లా థాకుర్పారా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామంలో మైనార్టీ కమ్యూనిటీకి చెందిన ఓ యువకుడు ఫేస్బుక్లో అభ్యంతరకరమైన పోస్టు చేసినట్లు పుకార్లు వ్యాపించడంతో ఆందోళనకారులు దాడికి దిగారు. చుట్టుపక్కల ఆరు, ఏడు గ్రామాలకు చెందిన దాదాపు 20వేల మంది ఆందోళనకారులు థాకుర్పారా గ్రామంలోని హిందువులపై దాడి చేశారు. హిందువులకు చెందిన 30 ఇళ్లను కొల్లగొట్టి వాటికి నిప్పుపెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.
శాంతి, భద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించి, రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగ్రాతులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనకు సంబంధించి 33 మంది ఆందోళనాకారులను నిర్బంధించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కాల్పులు జరపడాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు రంగ్పూర్-దినాజ్పూర్ హైవేపై ఆందోళనకు దిగారు. రహదారిని మూసివేసి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు