బంగ్లాదేశ్లో 30 హిందువుల ఇళ్ళు దగ్ధం
- November 11, 2017
బంగ్లాదేశ్లో గుర్తు తెలియని వ్యక్తులు హిందువుల ఇళ్లపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. రంగ్పూర్ జిల్లా థాకుర్పారా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామంలో మైనార్టీ కమ్యూనిటీకి చెందిన ఓ యువకుడు ఫేస్బుక్లో అభ్యంతరకరమైన పోస్టు చేసినట్లు పుకార్లు వ్యాపించడంతో ఆందోళనకారులు దాడికి దిగారు. చుట్టుపక్కల ఆరు, ఏడు గ్రామాలకు చెందిన దాదాపు 20వేల మంది ఆందోళనకారులు థాకుర్పారా గ్రామంలోని హిందువులపై దాడి చేశారు. హిందువులకు చెందిన 30 ఇళ్లను కొల్లగొట్టి వాటికి నిప్పుపెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.
శాంతి, భద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించి, రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగ్రాతులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనకు సంబంధించి 33 మంది ఆందోళనాకారులను నిర్బంధించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కాల్పులు జరపడాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు రంగ్పూర్-దినాజ్పూర్ హైవేపై ఆందోళనకు దిగారు. రహదారిని మూసివేసి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తాజా వార్తలు
- భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత..
- సింహాచలం: మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు
- కోల్కతాలో విషాద ఘటన..14 మంది మృతి..
- దుబాయ్ అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం..!!
- ప్రపంచ ఆరోగ్య సర్వే 2025 ను ప్రారంభించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ..!!
- తుమామా స్టేడియం దగ్గర ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ITEX 2025.. ఒమన్ కు ప్రాతినిధ్యం వహించే వారి వివరాలు వెల్లడి..!!
- 16 నకిలీ సోషల్ మీడియా ఖాతాలు.. నిందితుడి అరెస్టు..!!
- 2025 మొదటి 3 నెలల్లో.. 42 మిలియన్ల దిర్హామ్లకు పైగా ఫేక్ వస్తువులు సీజ్..!!
- ఇండియన్ ఎయిర్ స్పేస్ బంద్!