త్వరలో టీడీపీలో చేరుతున్నా వాణీ విశ్వనాథ్
- November 13, 2017
అనంతపురం జిల్లాలో నందమూరి బాలకృష్ణ హెల్పింగ్ హ్యాండ్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్పెషల్ ఎట్రాక్షన్ గా నాటి నటి వాణి విశ్వనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంలో చంద్రబాబు పై తనకు ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. తాను రాజకీయాల్లో ఉన్నా లేక పోయిన తన మద్దతూ మాత్రం చంద్రబాబుకే అని తెలిపింది. చంద్రబాబు గొప్ప నాయకుడని... ఆయన ప్రవేశ పెట్టిన అభివృద్ది కార్యక్రమాలతో ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని...ప్రజల శ్రేయస్సు కోసం ఆయన అహర్నిశలు కష్టపడేమనస్థత్వాని అభినందిస్తున్నానని వాణి తెలిపింది. అందుకే టీడీపీ చేరుతున్నానని తెలిపింది. పాలిటిక్స్ లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉందని...అది టీడీపీ ద్వారా నేరవేరుతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







