విశ్వ కర్మ క్రియేషన్స్ పతాకం పై ఒక షీ టీమ్ పోలీస్ ఆఫీసర్ కథ.... మూవీగా
- November 13, 2017
విశ్వ కర్మ క్రియేషన్స్ పతాకం పై లక్ష్మణ్ కంచరి దర్శకనిర్మాతగా గౌతమి, శిరీష్ ముఖ్యతారాగణంతో నిర్మిస్తున్న చిత్రం లక్ష్మి నిలయం. ఈ చిత్రం ఈ రోజు ఉదయం రామానాయుడు స్టూడియోస్ లో లాంఛనంగా ప్రారంభం అయింది. ప్రతాని రామకృష్ణ గౌడ్ ముఖ్య అతిధి గా విచ్చేసి ముహూర్తం షాట్ కి క్లాప్ ఇచ్చి శుభారంభం పలికారు. దర్శకనిర్మాత లక్ష్మణ్ కంచరి తండ్రిగారు ఈశ్వరయ్య కెమెరా స్విచ్ ఆన్ చేయగా తన సోదరుడు వెంకటేష్ తొలిషాట్ డైరెక్షన్ చేసారు.
అనంతరం పాత్రికేయుల సమావేశంలో దర్శకనిర్మాత లక్ష్మణ్ కంచరి మాట్లాడుతూ "ఇది ఒక షీ టీమ్ పోలీస్ ఆఫీసర్ కథ. సమాజం లో మహిళపై వేధింపులు ఎలా ఉన్నాయి వాటిని మహిళలు ఎలా ఎదురుకోవాలి , షీ టీమ్ ని ఎలా సంప్రదించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే కథాంశం తో నిర్ణిస్తున్న చిత్రం ఇది. డిసెంబర్ రెండో వారం లో చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుంది. హైదరాబాద్ మరియు మెదక్ పరిసరప్రాంతాలలో రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి లో షూటింగ్ పూర్తిచేసుకొని ఏప్రిల్ లో చిత్రం విడుదలకి సన్నాహాలు చేస్తున్నాం. నటీనటులు : గౌతమి, శిరీష్ , కథ, స్క్రీన్ ప్లే దర్శకుడు నిర్మాత : లక్ష్మణ్ కంచరి, కెమరామెన్ : ఏ కే ఆనంద్, ఎడిటింగ్ : నందమూరి హరి, సంగీతం యాజమాన్య
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







