దీపావళి సందడి
- November 10, 2015
తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సందడి మొదలైంది. బాణసంచా దుకాణాలు కొనుగోలు దారులతో కిటకిటలాడుతున్నాయి.వెలుగుల దీపావళి పండుగలో ప్రమిదలు, బొమ్మలు, టపాసులే స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తాయి. ప్రమిదలు, బొమ్మల కోసం ప్రత్యేకంగా దుకాణాలు వెలిశాయి. కొనుగోలుదారులతో ఈ షాపులన్నీ కళకళలాడుతున్నాయి. వివిధ దీపాలతో ఇళ్లను అందంగా అలంకరిస్తున్నారు. ఈ దీపాల కాంతుల్లో ఇళ్లు దగధగమంటున్నాయి. బెంబేలెత్తిస్తున్న బాణ సంచా రేట్లు... మరోపక్క బాణసంచా రేట్లను చూసి వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ధరలు చూసి దీపావళి ఆనందం సగం ఆవిరి అయిపోతోంది. గతేడాదితో పోల్చితే రేట్లు రెట్టింపు అయ్యాయి. పండగ రోజు కావడంతో రేట్లు మరింత ఆకాశాన్నంటుతున్నాయి. తగ్గిన బాణాసంచా తయారీ ... ఇది ఇలా ఉంటే ఏపీలో కొన్ని ప్రాంతాల్లో బాణసంచా కొనుగోళ్లు తగ్గిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల దక్షిణ కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వీటి ప్రభావం కొనుగోళ్లపై పడింది. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో కురిసిన వర్షాల దెబ్బకు బాణసంచా అమ్మకాలు భారీగా దిగజారాయి. తిరుపతిలో అమ్మకం దారులు గొగ్గోలు పెడుతున్నారు. తమ పెట్టుబడులైనా తిరిగివస్తాయో రావో అని వ్యాపారుల్లో దిగులుమొదలైంది. టపాసులు కాల్చవద్దంటున్న పర్యావరణ వేత్తలు .. మరోపక్క టపాసులు కాల్చకుండా దీపావళిని జరుపుకోవాలని పర్యావరణవేత్తలు పిలుపునిస్తున్నారు. క్రాకర్స్ విపరీతంగా కాల్చడం వల్ల శబ్ధ కాలుష్యంతో పాటు... పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో నూ .... వెలుగుల దీపావళి పండుగలో ప్రమిదలు, బొమ్మలకు, టపాకాయలే స్పెషల్ అట్రాక్షన్... గుమ్మంనుంచి ఇంటిఆవరణవరకూ అలంకరణతో ఇళ్లన్నీ మెరిసిపోతూ ఉంటాయి.. దీపాల కాంతులతో ధగధగమంటాయి.. అటు ప్రమిదలు, బొమ్మల తయారీదారులు, వ్యాపారులకు మంచి గిరాకీ ఉంటుంది.. హైదరాబాద్లో ఈ వస్తువులతో ప్రత్యేకంగా దుకాణాలు వెలిశాయి.. కొనుగోలుదారులతో ఈ షాపులన్నీ కళకళలాడుతున్నాయి.. మట్టి ప్రమిదల్లో దీపాలు..... దీపావళి రోజున మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు.. ఈమధ్య వివిధ రకాల వస్తువులు అందుబాటులోకివచ్చాయి.. సంప్రదాయ ప్రమిదలకుతోడు ఆకట్టుకునే డిజైన్లు ఇప్పుడు అందరినీ ఆకర్శిస్తున్నాయి.. ఇక అలంకరణలో దేవతామూర్తుల ప్రతిమలకు డిమాండ్ పెరుగుతోంది.. బొమ్మలకొలువుకోసం వివిధరకాల ప్రతిమలను కొనుగోలు చేస్తున్నారు మహిళలు.. పండుగరోజు రష్ ఎక్కువగా ఉంటుందంటూ ముందుగానే వస్తువులు కొనేస్తున్నారు జనాలు.. దీపావళిని మరింత సంతోషంగా గడిపేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు..
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







