దీపావళి కానుకగా ఈరోజు 'తను నేను' ట్రైలర్ విడుదల
- November 10, 2015
అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, ఉయ్యాలా జంపాలా వంటి సూపర్హిట్ చిత్రాలను నిర్మించి అభిరుచిగల నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న రామ్మోహన్ పి. ఇప్పుడు దర్శకుడుగా మారారు. అవికా గోర్ హీరోయిన్గా, 'వర్షం' దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా డి.సురేష్బాబు సమర్పణలో సన్షైన్ సినిమా, వయాకామ్ 18 పిక్చర్స్ పతాకాలపై స్వీయ దర్శకత్వంలో రామ్మోహన్ పి. నిర్మిస్తున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'తను నేను' షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను దీపావళి కానుకగా ఈరోజు విడుదల చేశారు. నవంబర్ 11 నుండి 'అఖిల్' చిత్రంతోపాటు 'తను నేను' ట్రైలర్ కూడా ప్రదర్శించబడుతుంది. సన్ని ఎం.ఆర్. సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో నవంబర్ చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అవికా గోర్, సంతోష్ శోభన్, అల్లరి రవిబాబు, సత్యకృష్ణ, కిరీటి దమ్మరాజు, ఆర్.కె. మామ, రాజశ్రీనాయుడు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్., సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: ఎస్.రవీందర్, నిర్మాణం: సన్షైన్ సినిమాస్
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







