దాడులు జరగొచ్చు...అమెరికా పోలీస్ శాఖ హెచ్చరికలు
- November 17, 2017
వాషింగ్టన్: క్రిస్మస్, న్యూ ఇయర్ పండుగలు దగ్గరపడుతున్నాయి. దాంతో చాలా మంది ప్రజలు వేడుకలు చేసుకోవడానికి వివిధ దేశాలకు వెళుతుంటారు. అయితే వేడుకల కోసం యూరప్ వెళ్లే అమెరికన్లు జాగ్రత్తగా ఉండాలని అమెరికా పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
క్రిస్మస్ నాడు యూరప్లో దాడులు జరిగే అవకాశం ఉందని అమెరికన్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గతేడాది క్రిస్మస్ పండుగ నాడు జర్మనీలోని బెర్లిన్లో దాడులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మృతిచెందారు. టర్కీలోనూ ఓ నైట్క్లబ్లో కాల్పులు జరగడంతో 30 మంది మృత్యువాతపడ్డారు. బ్రిటన్, ఫిన్ల్యాండ్, రష్యా, స్పెయిన్, స్వీడెన్ దేశాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అల్ఖైదా, ఐసిస్ ఉగ్రమూకలు ఈ దేశాలపైనే నిఘా పెట్టినట్లు అమెరికన్ పోలీస్ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







