'పద్మావతి' లొల్లి
- November 21, 2017
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ప్రతిష్టాత్మంగా తెరకెక్కించిన 'పద్మావతి' చిత్రంపై రగులుకున్న రాజకీయ రగడ ఇప్పట్లో చల్లారేలా లేదు. సందట్లో సడేమియాగా ఈ వివాదం నుంచి లబ్ది పొందేందుకు రాజకీయ పార్టీలు.. ప్రత్యేకించి బీజేపీ ఉవ్విళ్లూరుతున్నట్టు కనిపిస్తోంది. భోపాల్లో మహారాణి పద్మావతికి స్మారకమందిరం నిర్మిస్తామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ ప్రకటించారు. రాణి పద్మావతిని రాష్ట్రమాతగా పేర్కొన్న ఆయన... రాణి పేరుమీదుగా ఓ అవార్డు కూడా ప్రారంభించాలని నిర్ణయించారు. మహిళల అభివృద్ధి కోసం కృషిచేసేవారికి ''రాష్ట్రమాత పద్మావతి పురస్కార్''తో సత్కరిస్తామని ఆయన ప్రకటించారు. రాజ్పుత్ వర్గీయుల మనోభావాలను గాయపర్చే సన్నివేశాలను తొలగించకపోతే.. తమ రాష్ట్రంలో పద్మవతి సినిమాను విడుదల కానివ్వబోమని మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. మరుసటిరోజే ఈ అంశంపై ఈ బీజేపీ నేత మరింత దూకుడు ప్రదర్శించడం విశేషం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







