ఎక్లయిర్స్
- November 21, 2017
పేస్ట్కి కావలసినవి: వెన్న 100గ్రా.,మైదా 100గ్రా., నీళ్లు పావులీటరు, పంచదార ఒక టేబుల్ స్పూన్, నాలుగు గుడ్లు.., బన్నుల్లో నింపడానికి, టాపింగ్కి..., 200గ్రా చాకొలెట్, 150 మి.లీ క్రీం.
తయారీ విధానం
నీళ్లల్లో వెన్న వేసి మరిగించి దించి దానిలో పంచదార, మైదా వేసి బాగా కలిసేలా గిలకొట్టండి. పిండి మృదువుగా మారిన తరువాత మళ్లీ పొయ్యి మీద పెట్టి పిండి పక్కల అంటుకోకుండా ఉన్నప్పుడు దించివేయండి. అందు లో గిలక్కొట్టిన గుడ్లు వేసి బాగా కలియతిప్పండి. దీనివలన పిండి చిక్కగా మెరుస్తూ స్పూన్ నుంచి జారిపోయేలా అవుతుంది. దీనిని (ఎక్లైర్స్) సన్నగా పొడవైన ఆకారంలో వచ్చేలా చేసుకుని బేకింగ్ గిన్నెలో వేసుకుని 25 నిమిషాల పాటు కుక్కర్లో కేక్ని బేక్ చేసినట్లుగా చేయండి.
ఫిల్లింగ్కి...
చాకొలెట్ని, క్రీంని కరిగించి రెండుభాగాలుగా విభజించండి. పదునైన చాకు ని తీసుకుని ఎక్లైర్స్కి రంధ్రం చేసి అందులో చాకొలెట్ మిశ్రమాన్ని నింపండి. పూర్తిగా నింపిన తరువాత ఎక్లైర్స్ అన్నింటినీ మిగిలిన చాకొలెట్ మిశ్రమం లో దొర్లిస్తే వాటి వెలుపల కూడా అంటుకొని చాకొలెట్ రుచి పిల్లలకి బాగా నచ్చుతుంది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









