ఏ పి ముఖ్యమంత్రిని కలిసిన కమల్
- November 12, 2015
విలక్షణ నటుడు, దర్శకుడు కమల్ హాసన్ గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారు చంద్రబాబు నాయుడిని కలిసారు. భేటీ అనంతరం కమల్ మాట్లాడుతూ...తన అప్ కమింగ్ మూవీ 'చీకటి రాజ్యం ' ప్రీమియర్ షో ను విజయవాడలో ప్రదర్శించేందుకు అనుమతి కోసం చంద్రబాబును కలిసినట్లు తెలిపారు. అలాగే చీకటిరాజ్యం చిత్రాన్ని చూడాల్సిందిగా ఆయనను కోరినట్టు కమల్ వెల్లడించారు. తన విజ్ఞప్తిని చంద్రబాబు సంతోషంగా అంగీకరించారన్నారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమైన చీకటి రాజ్యం సినిమా ప్రీమియర్ షోలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకే రోజు ప్రదర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు. ఆరుగంటల గ్యాప్ తో రెండు రాష్ట్రాల్లో ఈ షోలను ప్రదర్శించనున్నట్టు ఆయన తెలిపారు. కాగా తమిళంలో మంగళవారం రిలీజైన ఈ చిత్రం విజయవంతంగా నడుస్తోంది. కాగా స్వీయ దర్శకత్వంలో ఫ్రెంచ్ థ్రిల్లర్ ..స్లీప్ లెస్ నైట్ సినిమాను కమల్ రీమేక్ చేశారు. కమల్ హీరోగా నటించిన ఈ సినిమాలో త్రిష, ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్, కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







