ఏ పి ముఖ్యమంత్రిని కలిసిన కమల్
- November 12, 2015
విలక్షణ నటుడు, దర్శకుడు కమల్ హాసన్ గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారు చంద్రబాబు నాయుడిని కలిసారు. భేటీ అనంతరం కమల్ మాట్లాడుతూ...తన అప్ కమింగ్ మూవీ 'చీకటి రాజ్యం ' ప్రీమియర్ షో ను విజయవాడలో ప్రదర్శించేందుకు అనుమతి కోసం చంద్రబాబును కలిసినట్లు తెలిపారు. అలాగే చీకటిరాజ్యం చిత్రాన్ని చూడాల్సిందిగా ఆయనను కోరినట్టు కమల్ వెల్లడించారు. తన విజ్ఞప్తిని చంద్రబాబు సంతోషంగా అంగీకరించారన్నారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమైన చీకటి రాజ్యం సినిమా ప్రీమియర్ షోలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకే రోజు ప్రదర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు. ఆరుగంటల గ్యాప్ తో రెండు రాష్ట్రాల్లో ఈ షోలను ప్రదర్శించనున్నట్టు ఆయన తెలిపారు. కాగా తమిళంలో మంగళవారం రిలీజైన ఈ చిత్రం విజయవంతంగా నడుస్తోంది. కాగా స్వీయ దర్శకత్వంలో ఫ్రెంచ్ థ్రిల్లర్ ..స్లీప్ లెస్ నైట్ సినిమాను కమల్ రీమేక్ చేశారు. కమల్ హీరోగా నటించిన ఈ సినిమాలో త్రిష, ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్, కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









