మన కాలపు త్యాగయ్య మంగళంపల్లి ప్రథమ వర్ధంతి నేడు...!!
- November 22, 2017
ఏ వేదిక మీదనున్నా చెరగని చిరునవ్వు... మధుర కంఠస్వరం, ఎలాంటి క్లిష్టమైన రాగం పడుతున్నా గమకాలు వేస్తున్నా అదే నగుమోము..!! ఎప్పటికీ మరపురాని ఆ నగుమోము మనకి దూరమై ఏడాది అయ్యింది. బాలమురళీకృష్ణ గారు తన 86 ఏట... చెన్నైలో తన నివాసంలో మృతి చెందారు. మంగళంపల్లి పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ దంపతులకు ముద్దుల తనయుడైన బాలమురళికి సంగీతం అంటే ఎంతో ఇష్టం. 8 వ ఏట కచేరీ చేసిన ఆయన.. కంఠస్వరం నుంచి జాలువారే పాటలు సంగీత ప్రియులను మంత్ర ముగ్ధులను చేశాయి.
గాయకులుగానే కాకుండా వయొలిన్, మృదంగం తదితర ఇతర సంగీత వాయిద్యాల్లోనూ ప్రావీణ్యత సాధించిన ఘనత ఆయనది. పద్మభూషణ్, డాక్టరేట్ల వంటి బిరుదులను పొందిన ఆయన పలు చిత్రాల్లోనూ నటించారు. ఆయన భౌతికంగా దూరమైన ఆయన ఆలపించిన కీర్తనలు సంగీత ప్రియుల హృదయ కుహరాల్లో నిత్యం ఆ మధుర మోహన మురళీ రవళులు సందడులు చేస్తూనే ఉంటాయి. ఆ ప్రసన్న వదనం మనకీ ప్రసన్న భావాలనే కలిగిస్తూ ఉంటుంది. మన కాలపు త్యాగయ్య మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి ప్రథమ వర్థంతి సందర్భంగా నివాళులు. భువన సమ్మోహనకరమైన గానాన్ని మనకి అన్నేళ్లు వినిపించినందుకు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి ధన్యవాదాలు.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







